బాసర, సెప్టెంబర్ 30 : అమ్మవారి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నా యి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం సరస్వతీ అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు చేయించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో సుహాసిని పూజ, మంత్రపుష్పం, మూల నక్షత్రపూజలను అర్చకులు నిర్వహించారు.
రేపు మూలనక్షత్ర పూజలు
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆదివారం మూలనక్షత్ర పూజలు నిర్వహించనున్నా రు. మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో పలు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు సే వలు అందించనున్నారు. అమ్మవారి నక్షత్ర పూజలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ఏర్పాట్లను శుక్రవారం ఏఎస్పీ కిరణ్ఖారే, సీఐ వినోద్రెడ్డి, ఎస్ఐ మహేశ్ పరిశీలించారు. అనంతరం ఏఎస్పీ కిరణ్ఖారే సరస్వతీ అమ్మవా రిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.