బోథ్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారాన్ని శనివారం నిర్వహించారు.
బోథ్, జనవరి 28 : బోథ్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారాన్ని శనివారం నిర్వహించారు. మార్కెట్ యార్డులో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైన్మన్ సోలంకి రుక్మాన్సింగ్, వైస్ చైర్మన్ ఎల్టీ సంజీవ్రెడ్డిలతో పాటు డైరెక్టర్లతో ఆదిలాలబాద్ జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్ ప్రమాణం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను శాలువాలతో సత్కరించారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ డీ నారాయణరెడ్డి, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ఆత్మ చైర్మన్ ఎం సుభాష్, సర్పంచ్ జీ సురేందర్యాదవ్, ఎలుక రాజు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.