సారంగాపూర్, జనవరి 14 : దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలం బండరేవుతండాలో శనివారం జరిగిన 30వ నానుమహారాజ్ జాతర కు హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకొని కబడ్డీ పోటీలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ పురాతన ఆలయాలకు నిధులు మంజూరు చేసి ఆధునీకరించి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం సీఎం కేసీఆర్ రైతుబంధు, పంటల సాగుకు పెట్టుబడిసాయం, ఆసరా పింఛన్లు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. గిరిజనుల ఆరాధ్యదైవం నానుమహారాజ్ జాతర 30 సంవత్సరాల నుంచి జరుపుకోవడం అభినం దనీయమన్నారు. నానుమహారాజ్ ఆలయ పునర్నిర్మాణానికి రూ. 28లక్షలు మంజూరు చేశామని, త్వరలో టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
రూ. 3లక్షలతో ఆల యానికి రోడ్డును నిర్మించామని పేర్కొన్నారు. అలాగే పొట్యాలకు సబ్స్టేషన్ మంజూరు చేశా మని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపా రు. అనంతరం కబడ్డీ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన జట్టుకు 20,116, ద్వితీయ బహుమతి సాధించిన జట్టుకు రూ. 11,116 నగదును నిర్వాహకులకు అందజేశారు. ఇందులో రైతు బంధు సమితి సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిరా నారాయణరెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపెల్లి మాదవరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దత్తురాం, ఆర్గనైజిం గ్ కమిటీ సభ్యులు దావుజీనాయక్, ఈనేశ్, రఘునాథ్, దినేశ్, రాంజీ, సర్పంచ్లు, ఎంపీటీసీ లు, నాయకులు పాల్గొన్నారు.