నిర్మల్ అర్బన్, జూన్ 10: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే ప్రజలకు సుపరిపాలన అందు తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దే వాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో శనివారం సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్పీ సీఈవో సుధీర్ తొమ్మిదేళ్ల లో సాధించిన ప్రగతిని అధికారులు, ప్రజా ప్రతినిధులకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధించి న ప్రగతిని ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా చూపించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక్కటే ఉండేదని, ఏ చిన్న పని ఉ న్నా వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆదిలాబాద్కు రావాల్సి వచ్చేదని పేర్కొన్నారు. మన నీళ్లు, మన నిధులు, నియామకాల కోసం 14 ఏండ్లు పోరాడి సాధించుకున్న బంగారు తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలకు సుపరిపాలన అందుతున్నదని తెలిపారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామ ని, రాష్ట్రం ఏర్పడకుంటే జిల్లాలు రాకపోతుండే అ ని గుర్తు చేశారు. నూతన జిల్లాల ఏర్పాటుతో పరిపాలనా వికేంద్రీకరణ జరిగి ప్రజల వద్దకే పాలన వచ్చిందని తెలిపారు. అన్ని శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా అందుబాటులో నే ఉంటున్నారని అన్నారు. ఇక్కడి అభివృద్ధిని మె చ్చిన కేంద్రం అనేక అవార్డులను ఇచ్చిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో పటిష్టమైన పోలీసింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని, 10 వేల సీసీ కెమెరాల తో నిఘాను పటిష్టం చేసి ప్రజలకు మెరుగైన శాం తి భద్రతలను అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతిని గుర్తు చేస్తూ ఆయన ప్రసంగం కొనసా గింది. కార్యక్రమంలో ఎమెల్యేలు విఠల్ రెడ్డి, రే ఖా నాయక్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయల క్ష్మి, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్, డీఎఫ్వో సునీల్ హెరామత్, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో స్రవంతి, ఎంపీపీ రా మేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ జీవన్ రెడ్డి, ఓస రాజేశ్వర్, డాక్టర్ సుభాష్ రావు, అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.