నిర్మల్ చైన్గేట్, ఫిబ్రవరి 21 : ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, నిర్మల్ జిల్లా దవాఖాన అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. జిల్లా ప్రధాన దవాఖానలో మంగళశారం ఆస్పత్రి అభివృద్ధి సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరయ్యారు. ఇక్కడ రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసి సీటీ స్కాన్ను బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన పరిశీలించారు. దవాఖానలో స్వయంగా పలు వార్డులను సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దవాఖానపై నిర్మిస్తున్న 150 అదనపు పడకల నిర్మాణం పనులను పర్యవేక్షించారు. పనులపై ఆరా తీశారు. త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం దవాఖానలో జరిగిన సలహా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవేందర్రెడ్డి ప్రతిపాదించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా కృషి చేస్తోందన్నారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ వరుణ్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఆర్ఎంవో వేణుగోపాలకృష్ణ, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం రానున్నారు. ఈ మేరకు దవాఖానలో రూ.1.50 కోట్లతో ఏర్పాటు సీటీ స్కాన్ను ప్రారంభించనున్నారు.
సారంగాపూర్, ఫిబ్రవరి 21 : సారంగాపూర్ మండలం జామ్ కేజీబీవీలో రూ. 2.5 కోట్ల సర్వశిక్షా అభియాన్ నిధులతో నిర్మించిన కళాశాల భవనాన్ని మంత్రి అల్లోల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధ్యామిస్తున్నదని అన్నారు. ప్రభ్వుం బాలికల్లో ఆత్మైస్థెర్యం నింపేదుకు కేజీబీవీల్లో కరాటే శిక్షణను ప్రవేశపెట్టిందని తెలిపారు. చదువులో రాణించేందుకు పదోతరగతి విద్యార్థులకు సాంత్రం అల్పాహారం అందిస్తున్నదని చెప్పారు. బాలికా చదువును ప్రోత్సహిస్తూ కేజీబీవీల్లో కళాశాల విద్య ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. గతేడాది పదోతరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రెండోస్థానం సాధించిందని, ఈ ఏడాది మొదటి స్థానం సాధించేలా కృషిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లావెంకట్రాంరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ ఎలిపెద్ది మాణిక్రెడ్డి, సర్పంచ్ మహిపాల్ మురళీకృష్ణ, ఎంపీటీసీ మహిపాల్ వనజ, సర్వశిక్షా అభియాన్ ఈఈ అశోక్, డీఈ గంగాధర్గౌడ్, తహసీల్దార్ సంతోష్రెడ్డి, ఎంపీడీవో సరోజ, సెక్టోరియల్ అధికారులు శ్రీదేవి, పద్మ, ఎస్వో అన్నపూర్ణ, ఏఈ తుకారం, నాయకులు రాజ్మహ్మద్, కండెల భోజన్న, దాతర్క రాజలింగం, ముద్రం దినేశ్, పతాని భౌమేశ్, దండు సాయికృష్ణ, దేవిశంకర్, పాల వీరన్న, డీలర్లు మహేశ్రెడ్డి, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
సోన్, ఫిబ్రవరి 21 : సోన్ మండలం సిద్ధులకుంటలోని సిద్ధేశ్వరస్వామి ఆలయంలో కల్యాణమండప నిర్మాణ పనులకు మంత్రి అల్లోల శంకుస్థాపన చేశారు. అలాగే ప్రభుత్వ నిధులతో నిర్మించిన విశ్వబ్రాహ్మణ సంఘం, గురిడెకాపు సంఘం, అంబేద్కర్ సంఘం, నాక్పోడ్ సంఘాల కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసే దేశప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తున్నారన్నారు. 50 ఏండ్లలో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో చేసి చూపించిందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో 5 గంటల పాటు కరంట్ ఉంటే తెలంగాణలో 24 గంటలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అక్కడ రూ.800 పింఛన్ ఉంటే ఇక్కడ రూ.2,016, రూ.3,016 ఇస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో ప్రతీ ఇంటికి సీఎం కేసీఆర్ పెద్దకొడుకుగా మారారని గుర్తుచేశారు. సిద్ధులకుంట గ్రామానికి ఏది కావాలన్నా మంజూరు చేసినట్లు చెప్పారు. కాగా, పాఠశాల ప్రహరీ నిర్మించాలని కోరుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు మంత్రికి వినతి పత్రం అందించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం గ్రామానికి చెందిన రైతు హరీశ్ ఇటీవల మృతిచెందగా, రైతు బీమా కింద మంజూరైన రూ.5 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ మోహినొద్దీన్, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ మహేందర్రెడ్డి, తహసీల్దార్ హిమబిందు, ఏవో వసంత్రావు, ఏఈవో హర్షిత, నాయకులు మురళీధర్రెడ్డి, భూమారెడ్డి, సతీశ్రెడ్డి, ఎల్చల్ గంగారెడ్డి, టీ వినోద్, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.