మామడ, అక్టోబర్ 20 : వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని రాష్ట్ర అట వీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇం ద్రకరణ్రెడ్డి అన్నారు. పొన్కల్ను నూతన మండలంగా ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ మండల పరిధిలో వచ్చే 10 గ్రామాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డికి కృతజ్ఞత సభను మండలకేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పొన్కల్ మండల పరిధి ప్రారంభమైన బండల్ ఖానాపూర్ నుంచి వందలాది ద్విచక్ర వాహనలతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పొన్కల్ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఆలయానికి చేరుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. మండల ఏర్పాటుకు కృషి చేసిన మంత్రి అల్లోలను వారు సన్మానించా రు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10 గ్రామాల ప్రజల కోరిక మేరకు పొన్కల్ మండలం గా ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో తన ను గెలిపిస్తే పొన్కల్ మండల అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పేద ప్రజల సంక్షేమానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భూమేశ్వర్, డీసీసీబీ డైరెక్టర్ హరీశ్కుమార్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్గౌడ్, బీఆర్ఎస్ మాజీ మండల కన్వీనర్ నవీన్రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల నాయకులు, జేఏసీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు..
మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు మంత్రి అల్లోల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి తెలిపారు.
దిలావర్పూర్, అక్టోబర్ 20 : ఎన్నికలు రాగానే ఆగం ఆగం కావద్దు…ఈ 40 రోజులు మీరు కష్టపడి పని చేస్తే ఐదేండ్లు మీ సేవకుడిగా పనిచేస్తానని నిర్మల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని సిర్గాపూర్లోని రుక్మారెడ్డి గార్డెన్లో ఉమ్మడి దిలావర్పూర్ మండల కార్యకర్తలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. అంతకు ముందు దిలావర్పూర్ గ్రామంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన వా రితో కలిసి బైక్ ర్యాలీ తీశారు. అక్కడి నుంచి సిర్గాపూర్కు చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.అనంతరం వివిధ పార్టీలకు చెందిన దాదాపు 500 మందికి పైగా కార్యకర్తలు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల చిన్న దేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి రంజిత్రెడ్డి, బన్సపల్లీ సహకార సంఘం చైర్మన్ పీవీ రమణరెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్రావు, రైతుబంధుసమితి మండలాధ్యక్షుడు కోడే రాజేశ్వర్, గంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బాబురావు, ఓడ్నం కృష్ణ, పాల్దే అనిల్, పాల్దె శ్రీనివాస్, గంగారెడ్డి, కోండ్రు రమేశ్, తిరుపతిరెడ్డి కదిలి కాల్వ ఆలయాల చైర్మన్లు వెంకట్రావు, పూజారం మహేశ్, కాల్వ నర్సారెడ్డి, దనే రవి, సప్పల రవి, కోడే నవీన్, సజ్టు, రషీద్, అన్వర్ఖాన్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.