రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం ‘ఆధ్యాత్మిక దినోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. హోమం నిర్వహించడంతో పాటు పూజారులను సన్మానించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్వరాష్ట్రంలోనే ఆలయాలకు పునర్వైభవం వచ్చిందని స్పష్టం చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దేవుళ్లను వేడుకున్నారు. ఆయా చోట్ల ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, రేఖానాయక్, నడిపల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, కలెక్టర్లు రాహుల్ రాజ్, బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
ఎదులాపురం/ఆదిలాబాద్ రూరల్, జూన్ 21: దేశంలోని ప్రజలందరూ సుఖసంతోషాలు; ఐష్టెశ్వర్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం కైలాస్నగర్లోని అశోక్బుద్ధ విహార్లో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా పంచశీల జెండాను ఆవిష్కరించారు. గౌతమ బుద్ధుని ప్రతిమ వద్ద జ్యోతి వెలిగించి బుద్ధ వందనాన్ని ఆలపించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రజలందరూ ప్రేమతో బతకాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి భగత్ సునీతాకుమారి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, భారత బౌద్ధ మహాసభ అధ్యక్షుడు శాలిక్రావు నాగరాడే, అంబేద్కర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాబా సాహెబ్ కాంబ్లే, నేతకాని మహార్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుర్గం శేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, బీఆర్ఎస్ నాయకుడు రాంకుమార్, అనిల్, సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడు దయానంద్ కాంబ్లే, రమాబాయి అంబేద్కర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు శోభాబాయి తుల్జాపూరే, సభ్యులు గంగారాం బోరేకర్, రాంకిషన్ కోకనే, గౌతమ సింగంకర్, కుశ్వర్త బాయి, బేబీ బాయి కానిదే, అరుణాబాయి, జాదవ్ అనితాబాయి, ఎం మహేందర్, కావేటి మోహన్, ఆడే రఘనాథ్, జందడే రాహుల్, సూరజ్కాంబ్లే తదితరులున్నారు.
జిల్లాకేంద్రంలోని మార్వాడి ధర్మశాలలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. వీరికి పూజారి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుదర్శన యాగం, వేద పారాయణంలో పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రౌతు మనోహర్, జైనథ్ ఎంపీపీ గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల అరుంధతి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బోథ్, జూన్ 21 : మండల కేంద్రంలోని విఠలేశ్వరాలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవానికి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని శాలువాతో సన్మానించారు. 9 ఆలయాలకు ధూపదీప నైవేద్యం ద్వారా మంజూరైన ప్రొసీడింగ్ను పూజారులకు అందజేశారు. సొనాల గ్రామానికి చెందిన ఆర్ శంకర్కు రూ.14 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రుక్మాన్ సింగ్, వైస్ ఎంపీపీ లింబాజీ, వైస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, ఎలుక రాజు, సర్పంచ్ సురేందర్, సుభాష్, జగన్ రెడ్డి, రాయలు, రమణా గౌడ్, వీడీసీ గంగాధర్ పాల్గొన్నారు.
– ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
ఖానాపూర్, జూన్ 21: సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాలకు మహర్దశ లభించిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఖానాపూర్లోని శ్రీ వేంకటేశ్వరాలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక దినోత్సవంలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. పార్థనా మందిరాలు, ఆలయాల్లో పూజలు చేసే అర్చకులకు గౌరవ వేతనం కల్పిస్తున్న ఘనత కేవలం సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. అనంతరం అర్చకులను శాలువాతో సన్మానించి ఆలయానికి ధూపదీప నైవేద్య పథకం కింద మంజూరైన జీవో కాపీని కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నరసింహమూర్తి, ఎంపీడీవో మల్లేశం, నాయకులు శంకర్, గజేంధర్, గంగాధర్, గోపాల్, నగేశ్, నారాయణ, నర్సయ్య పాల్గొన్నారు.
ముథోల్ నియోజకవర్గంలో..
బాసర, జూన్ 21 : ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా బాసర అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో విజయరామారావు, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.