ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
జైనూర్ మండల సమావేశానికి హాజరు
జైనూర్, మే 20 : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే ఆత్రం స క్కు సూచించారు. మండలకేంద్రంలోని ఎం పీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎం పీపీ కుమ్ర తిరుమల అధ్యక్షతన శుక్రవా రం నిర్వహించిన మండల సమావేశానికి ఆ యన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని ప్రజలు తన దృష్టికి తీసుకువస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు పనితీరు మార్చుకోవాలని లేకుం టే చర్యలు త ప్పవని హెచ్చరించారు. ఆయా శాఖల అధికారులు తమ నివేదికలను చదివా రు. గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వహ ణ పకడ్బందీగా జరిగేలా చూడాలని, అదేవిధంగా ఆరోగ్య స మస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. వైస్ ఎంపీపీ చీర్లె లక్ష్మ ణ్, తహసీల్దార్ సాయన్న, ఎంపీడీవో ప్రభుదయా, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్రావు, మండల కోఆప్షన్ సభ్యుడు ఫిరోజ్ఖాన్, సర్పంచ్లు పార్వతీ లక్ష్మణ్, రాహుల్, గోవింద్రావ్, భీంరావ్, మాధవ్రావ్, శ్యాంరావ్, ఎంపీటీసీలు జుగాదిరావ్, భగవంత్రావు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మండలకేంద్రంలోని సర్కారు దవాఖానను శుక్రవారం తనిఖీ చేశారు. రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న రక్తనిధి, షెడ్ పనులను పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. ఆయన వెంట రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాలా, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ అబుతాలిబ్, సీనియర్ నాయకుడు మెస్రం అంబాజీరావు, సర్పంచ్లు మడావి భీంరావ్, సిడాం భీంరా వ్, రాహుల్, శ్యాంరావ్, ఎంపీటీసీ జుగాది, భగవంత్రావు, వైద్యుడు నాగేంద్ర, వైద్య సిబ్బంది ఉన్నారు.