ఆదిలాబాద్, నవంబరు 15 (నమస్తే తెలంగా ణ): ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడేవారు. మహారాష్ట్ర సరిహద్దులో జైనథ్ మండలం కొరాట వద్ద ప్రభుత్వం రూ.1227 కోట్లతో చనా క, కొరాట ప్రాజెక్టును నిర్మిస్తున్నది. దీంతో 51 వే ల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన బరాజ్, కాలువలు, పంప్హౌస్ పనులు పూరి ్తకాగా, అధికారు లు ట్రయల్ రన్ కూడా విజయవంతంగా నిర్వహించారు. నియోజకవర్గంలో మిషన్ కాకతీయ లో భాగంగా నిర్మించిన చెరువుల ఫలితంగా రైతు లు రెండు పంటలు సాగు చేస్తున్నారు. చెక్డ్యాం ల నిర్మాణంతో భూగర్భజల మట్టి గణనీయంగా పెరిగింది.
అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు దవాఖా నల్లో చికిత్స చేయించుకున్న పేదలకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధిలో భాగంగా ఆర్థిక చే యూతను అందిస్తున్నది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో తొమ్మిదేళ్లుగా 1121 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.5.75 కోట్ల రూపాయలను సీఎంఆర్ఎఫ్ పథకంలో భాగంగా పంపిణీ చేసిం ది. నియోజకవర్గంలో మిషన్ కాకతీయలో భా గంగా చెరువుల మరమ్మతులకు రూ. 19 కోట్లను ప్రభుత్వం మంజూరుచేసింది.
జిల్లా కేంద్రంలోని రిమ్స్తో పాటు పట్టణ, ప్రా థమిక ఆరోగ్య కేంద్రాల్లో పేదలకు కార్పొరేట్ వై ద్య సేవలు అందుతున్నాయి. ఆరోగ్య సమస్యల తో వచ్చేవారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రభుత్వం టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పా టు చేసింది. 57 రకాల పరీక్షలు చేస్తున్నారు. రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ను నిర్మించారు. కార్డియాలజీ, న్యూరో, యూరాలజీ, సర్జికల్ అంకాలజీ, పీడియాట్రిక్ సేవలు అం దుబాటులో ఉన్నాయి. పేదలకు ఉచితం గా కీళ్ల మార్పిడి చికిత్స చేస్తున్నారు. రూ.1.56 కోట్లతో బేల పీహెచ్సీలో బిల్డింగ్ నిర్మాణం ప్రా రంభం కాగా, రూ.20 లక్షల చొప్పున 6 సబ్ సెం టర్ల నిర్మాణానికి రూ.1.20 కోట్లు మంజూరయ్యాయి.
నియోజకవర్గానికి ప్రభుత్వం అగ్రికల్చర్, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలను మంజూరు చే సింది. మన ఊరు- మనబడి, మనబస్త్తీ- మన బ డి కార్యక్రమం ద్వారా రూ.20కోట్ల నిధులతో మొ దటి విడుతలో ఆదిలాబాద్ నియోజక వర్గంలో 78 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించారు. పే ద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువులు అం దించడానికి బేలలో బీసీ బాలుర గురుకులం ప్రా రంభించారు. రూ.120 కోట్లతో 4 మైనార్టీ, రెండు బీసీ గురుకుల హాస్టళ్లను నిర్మించారు. జిల్లా కేం ద్రంలో రూ.40కోట్లతో నిరుద్యోగ యువకులకు ఉపాధి కోసం ఐటీ టవర్ కోసం భూమిని కేటాయించారు. జైనథ్లో రూ.3. 58 కోట్లతో మినీ స్టేడియం ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు.
నియోజకవర్గంలో గతంలో రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. రూ.వెయ్యి కోట్లను ప్ర జా రవాణా వ్యవస్థను మెరుగుపర్చడానికి వెచ్చిం చారు. రూ. 45 కోట్లతో ఆదిలాబాద్ నుంచి బేల వరకు నిర్మించిన రెండు వరుసల రహదారి ప్రజల కు ఎంతో ఉపయోగపడుతున్నది. ఆదిలాబాద్ ప ట్టణంలో రూ.63.29 కోట్లతో రోడ్ల విస్తరణ ప నులు, సీసీరోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పను ల కోసం కేటాయించారు. ఆదిలాబాద్ నుంచి కెరమెరి రోడ్డు రహదారిపై రూ.10 కోట్ల తో మూడు వంతెనలు నిర్మించారు. జామిని నుంచి పెన్గంగ రోడ్డును వెడల్పు చేయడానికి రూ.10 కోట్లు కేటాయించారు. బేల, ఆదిలాబాద్ పట్టణంలో రోడ్ల మరమ్మతులు, వెడల్పు కోసం రూ.4.30కోట్ల మంజూరు చేశారు. పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి , అండర్ బ్రిడ్జీల కోసం రూ.87.20 కోట్లతో పనులు నడుస్తున్నాయి.
జిల్లాలో రెండు ఐటీ కంపెనీలు ఉండగా 230 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.40 కోట్లతో మూడెకరాల్లో ఐటీ టవర్ను నిర్మిస్తున్నది. టవర్ నిర్మాణంతో ప్ర త్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
పేదింటి ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అ మలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అండగా నిలుస్తున్నాయి. నియోజకవర్గంలో ని ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్, మా వల, జైనథ్, బేల మండలాల్లోని 11,971 మం దికి ఈ పథకం వల్ల ప్రయోజనం చేకూరింది. ఇం దుకోసం రూ. 12.11 కోట్లు మంజూరు చేసింది.
ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు గతంలో కనీస సౌకర్యాలు లేక ఇ బ్బందులు పడేవారు. తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు సౌకర్యవంతంగా మారాయి. పట్టణ సుందరీకరణ పనులు, జంక్షన్ల అభివృద్ధి, హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, ఎల్ఈడీ బల్బుల కోసం రూ.11.68కోట్ల మంజూరు చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా రూ.21కోట్ల తో అన్ని వార్డుల్లో బీటీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశా రు. ఎంజీఎఫ్, పట్టణ ప్రగతి నిధులతో కమాండ్ కంట్రోల్ సెంటర్, హోల్సేల్ కూరగాయల మార్కెట్, డ్రైవేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్, ఇతర అ ధికారి భవన నిర్మాణల కోసం రూ.5.13 కోట్లు మంజూరు చేశారు. అలాగే రూ.25.53 కోట్లతో అన్ని వార్డుల్లో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కోసం కేటాయించారు. బంగారిగూడలో డంప్ యార్డు నిర్మాణం కోసం రూ.81 లక్షలు కేటాయించారు. పట్టణంలోని పలు వార్డుల్లో రూ.2.4 కోట్లతో ఓ పెన్ జిమ్లు ఏర్పాటు చేశారు. హరితహారం పా ర్కుల ఏర్పాటుకు రూ.11.30 కోట్ల నిధులు మం జూరు చేశారు. శానిటేషన్ కోసం ఆటో, ట్రా క్టర్స్ రూ.8.74కోట్లు కేటాయించారు. ఇండోర్ స్టేడి యం, ఐపీ స్టేడియం అభివృద్ధి, డైట్గ్రౌండ్ రూ.2.20 కోట్లతో క్రీడాప్రాంగణం ఏర్పాటు చేశా రు. పలుకాలనీల్లో రూ.4.13కోట్లతో వైకుంఠ ధామాల అభివృద్ధి, రూ.1.53కోట్లతో నీటి సరఫ రా పనులు, రూ.8.18కోట్ల నర్సరీల అభివృద్ది, అప్రోచ్రోడ్లు ఇతర పనులు పూర్తిచేశారు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలో దళితబస్తీలో భాగంగా 864 వ్యవసాయ ఆధారిత దళిత కు టుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికీ మూడెకరాల చొప్పున 2229 ఎకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 97 కోట్లు ఖర్చు చేసింది. దళితబంధు పథకంలో భాగంగా నియోజకవర్గంలోని 100 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ. 10 చొప్పున రూ.10 కోట్లను ప్రభుత్వం అందజేసింది. బీసీ, మైనార్టీలకు రూ. 1 లక్ష సాయాన్ని ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో వృద్ధులకు నామ్కేవాస్తేగా పింఛన్లు ఇచ్చేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన త ర్వాత ప్రభుత్వం ఆసరా పింఛన్ల పథకం అమలు చేస్తుండడంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులు, ఇతరులకు ప్రయోజనం చేకూరుతున్నది. నియోజకవర్గంలోని ఆదిలాబాద్ అర్బన్, రూరల్, మావల, జైనథ్, బేల మండలాల్లో 27,430 మంది పింఛన్ల లబ్ధిదారు లు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెలా రూ.5.80 కోట్లను మంజూరు చేస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఆదిలాబాద్ జి ల్లాను చిన్నచూపు చూశారు. ఫలితంగా నియో జకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. కేవలం పట్టణాలకే పరిమితమైన ఐటీ రంగం ఆదిలాబాద్కు విస్తరించింది. రూ.40 కో ట్లతో ఐటీ టవర్ సిద్ధమవుతున్నది. గతంలో ఎ న్నడూ చూడని అభివృద్ధి తొమ్మిదేళ్లలో జరిగింది. ముఖ్య మంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. మహారాష్ట్రలో నివసిస్తున్న సరిహద్దు ప్రాంతాల ప్రజలు తమను తెలంగా ణలో విలీనం చే యాలని కోరుతున్నారు. ఉపాధి కోసం వలసలు పోవడం లేదు.
-జోగు రామన్న, ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి