నార్నూర్, జనవరి 30 : కంది కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలోని ఉప మార్కెట్ కార్యాలయంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు.
డీఎం ప్రవీణ్ మాట్లాడుతూ.. తేమ 12 శాతం మించవద్దని.. పట్టా పాస్బుక్, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ పత్రాలు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. మొదటి రోజు క్వింటాలుకు రూ.9,772లు పలికింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, సర్పంచ్ బానోత్ గజానంద్నాయక్, మేనేజర్ సావిత, కో-ఆప్షన్ సభ్యుడు షేక్ దస్తగిరి, ఐటీడీఏ డైరెక్టర్ మడావి మాన్కు పటేల్, సీఈవో ఆడే గణేశ్, నాగోరావ్ పాల్గొన్నారు.