ఎదులాపురం,జూలై 19 : ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నతమైన సేవలు అందించాలని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించబడిన 26 మంది ఎస్ఐలలో 15 మంది బుధవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరంతా నిజామాబాద్ కమిషనరేట్ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించబడ్డారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మారుమూల ఆదివాసీ ప్రజల్లో వివిధ రకాల భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉంటాయన్నారు. తమకు కేటాయించిన పోలీస్ స్టేషన్లలో ప్రజలతో సంబంధాలు పెంచుకొని అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలని తెలిపారు.
యువత ఉన్నత భవిష్యత్కు సమాజంలో ప్రస్తుతం అనుసరిస్తున్న సైబర్ క్రైమ్లపై అవగాహన కల్పించాలన్నారు. బీ రాము, జీ నరేశ్, బీ నవీన్, పీ సంజీవరావు, సిరిగిరి సాయన్న, అనంతసాగర్, ఎండీ రహమతుల్లా, డీ దేవ్ కుమార్, బీ శివరాం, బీ పుష్పావతి, టీ గోవింద్, ఎస్ సంతోష్ రెడ్డి, సుంకరి సాయన్న, వీ ఉదయ్ కుమార్, హబీబ్ ఖాన్ జిల్లాకు కేటాయించగా, వీరికి త్వరలో పోస్టింగ్లు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీసీ దుర్గం శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ అన్వర్ ఉల్ హక్, సిబ్బంది పాల్గొన్నారు.