బెల్లంపల్లిరూరల్, మార్చి 10 : ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా ఆదివారం బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. బెల్లంపల్లి సీవోఈ బాలుర కళాశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి 227 మంది విద్యార్థులకుగాను 215, ఇంటర్మీడియట్లో ప్రవేశానికి 231 మంది విద్యార్థులకుగాను 216 మంది హాజరయ్యారు.
ఆదిలాబాద్ సీవోఈ బాలికల కళాశాలలో 6 వ తరగతిలో 116 మందికి 108, ఇంటర్మీడియట్లో 114 మందికి 110 మంది హాజరయ్యారు. ఆసిఫాబాద్ బాలుర కళాశాలలో 6వ తరగతిలో 95 మందికి 84, ఇంటర్మీడియట్లో 60 మందికి 48 మంది హాజరయ్యారు.
బెల్లంపల్లి,ఆసిఫాబాద్ కేంద్రాల్లో ఆర్సీవో కే.స్వరూపారాణి పర్యవేక్షించారు. బెల్లంపల్లి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్గా ఐనాల సైదులు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా వరమని ప్రమోద్కుమార్, రూట్ ఆఫీసర్గా దశరథరామ్ వ్యవహరించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. బెల్లంపల్లిలో తాళ్లగురిజాల ఎస్ఐ జి.నరేశ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.