ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 15 : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, పదో తరగతిలో ప్రతిభ కనబర్చాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కొలాం ఆశ్రమ పాఠశాలలో డివిజనల్ లెవెల్ స్టార్స్ కల్చరర్స్ ఫెస్ట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యంతో చైర్మన్కు ఘన స్వాగతం పలికారు. మొదట కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సరస్వతీదేవి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారుల సాం స్కృతిక నృత్యాలు తిలకించి అభినందించారు. విద్యార్థులు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మావల మండల పరిధిలోని వాఘాపూర్ గ్రామంలో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రారంభించారు. మొదటగా రిబ్బన్ కట్ చేసిన అనంతరం క్రీ డాకారులను పరిచయం చేసుకున్నారు. టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి సరదాగా బ్యాటింగ్, బౌ లింగ్ చేస్తూ అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. స్థానికులు ఆయనను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. సహచర టీంలు హృదయాలను గెలుచుకున్నప్పుడే నిజమైన గెలుపు వరిస్తుందని సూచించారు. జోగు ఫౌండేషన్ ద్వారా పల్లెల్లో విస్తృతంగా పో టీలు నిర్వహిస్తున్నామన్నారు. ఏఎంసీ చైర్మ న్ జయలక్ష్మి- రాజు, జడ్పీటీసీ నల్ల వనిత-రాజేశ్వర్, స ర్పంచ్ నారాయణ, మాజీ ఎం పీపీ చందాల ఈశ్వరి-రాజన్న, ఎన్నారై నరో త్తంరెడ్డి, సురేందర్ రెడ్డి, పోతారెడ్డి, బాపురావు, అశోక్, పండ్ల శ్రీను పాల్గొన్నారు.