ఎదులాపురం, సెప్టెంబరు 16: రాష్ట్రంలో వైద్య విద్యకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్లో మూడో విడుత కౌన్సెలింగ్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు అడ్మిషన్ ఆర్డర్లను శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేదింటి బిడ్డ లు కూడా వైద్యకళాశాలల్లో ప్రవేశం పొందేందుకు అ వకాశం ఏర్పడిందని తెలిపారు.
ఆదిలాబాద్ రిమ్స్ లో 120 సీట్లు ఉండగా దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు తెలంగాణకు చెందిన విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. ప్రభుత్వం కొత్తగా 64 మంది అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లను నియమించిందని తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, వైద్యులు తిప్పస్వామి, శ్యాంప్రసాద్, సుమలత, సిబ్బంది ప్రశాంత్ రెడ్డి, సుధీర్, నాయకులు సాజిదుద్దీన్, మెట్టు ప్రహ్లాద్, అలాల అ జయ్, బండారి సతీశ్, రమేశ్, వైద్య ఉద్యోగుల సం ఘం నాయకులు బండారి కృష్ణ పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు మౌలిక వసతులను కల్పిస్తున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ దవాఖానలో శనివారం రూ.11.35 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎంఆర్ఐ స్కానింగ్ మిషిన్, గదికి రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మించిన దవాఖానకు ఏటా రూ.50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కళ్యాణ్ రెడ్డి, సుమలత, శ్యాంప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణాధ్యక్షుడు అలాల అజయ్, ఫ్లోర్లీడర్ బండారి సతీశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు రాంకుమార్, సాజీదుద్దీన్, దాసరి రమేశ్, సామాజిక కార్యకర్త దేవన్న, తెలంగాణ వైద్యప్రజారోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ, తదితరులున్నారు.
స్థానిక వినాయక్చౌక్లోని వంట ఆచార్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీమా ఐడీ కార్డులు, సర్టిఫికెట్లను ఎమ్మెల్యే జోగు రామన్న వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేను సంఘం సభ్యు లు శాలువాతో సన్మానించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు సాజీదొద్దీన్, వం ట ఆచార్ల సంఘం అధ్యక్షుడు కన్నాల దేవ న్న, ఇర్ఫాన్ఖాన్, గంగన్న ఫిరోజ్, తదితరులున్నారు.