ఎదులాపురం, మార్చి18 : బీజేపీ అధికారంలో వస్తే నల్లడబ్బు దేశానికి తీసుకొచ్చి అందరి జీరో అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానమన్నారని, ‘జన్ధన్ ఖాతా కహాగయా’ మోదీ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని వార్డు నంబర్ 42 రిక్షా కాలనీలో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, మురుగు కాలువ నిర్మాణాల కోసం శనివారం భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం సైనిక్ వెల్ఫేర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 320 మందికి ఆసరా పింఛన్ లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వంట గ్యాస్, నిత్యాసరవ సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంది బీజేపీ ప్రభుత్వమేనని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రూ.400 ఉన్న గ్యాస్ ధరను ఇప్పుడు ఇంటికి వచ్చే వరకు రూ.1250 ఖర్చు అవుతుందని తెలిపారు.
సామన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ నాయకులను ప్రశ్నించాలని సూచించారు. దేశంలో ఎక్కడైనా రూ.2016, 3016 పింఛన్లు ఇస్తున్నారా? ఇతర రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి తదితర సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వడం లేదో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తామన్న మాట వాస్తవమన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేండ్ల పాటు కొవిడ్తో ఇబ్బందులు పడ్డ విషయాన్ని గుర్తుచేశారు. జిల్లాలో ప్రభుత్వ స్థలాలున్న చోట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించామని తెలిపారు.
స్థలాలు లేకపోవడంతో ఇండ్లు లేని వారికి సొంత స్థలాల్లో రూ.3 లక్షలతో గృహలక్ష్మి పథకాన్ని త్వరలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నిర్మాణమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఏప్రిల్లో లక్కీడ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. అనంతరం ఆసరా పింఛన్ల కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, పట్టణాధ్యక్షుడు అలాల అజయ్, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, బీసీ పట్టణాధ్యక్షుడు దాసరి రమేశ్, వార్డు కౌన్సిలర్ ఆవుల వెంకన్న, కో ఆప్షన్ సభ్యుడు ఎజాజ్, నాయకులు రాజు, కుమ్ర రాజు, సృజన్రెడ్డి, ఈఈ అరుణ్, డీఈ తిరుపతి, ఆర్ఐ వెంకటేశ్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం (జైనథ్), మార్చి 18 : నియోజవర్గంలో జరిగిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమా ల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని ప్రత్యేక పూ జలు నిర్వహించారు. జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే దత్త నామస్మరణ ఎక్కాహం మహాపూజలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో ప్రసిద్ధి గాం చిన దత్త మందిరానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా ఆహ్వానం పలికారు. దత్త మందిరంలో ప్రత్యేక పూజలు చేసి పండితులు ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం ఆలయాభివృద్ధికి తనవంతుగా రూ.50 వేలు అందజేశారు. గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు లింగారెడ్డి, ఎంపీటీసీ కోల భోజన్న, సర్పం చ్ కోల సుమ- పరమేశ్వర్ పాల్గొన్నారు.