త్వరలో ఆదిలాబాద్కు ఐటీ టవర్ మంజూరు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే జోగు రామన్న మంత్రి కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆదిలాబాద్ జిల్లా సమస్యలపై జోగు రామన్న.. మంత్రి కేటీఆర్తో చర్చించారు. దీంతో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణ కోసం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. సీసీఐ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిద్దాం. కేంద్రంపై ఒత్తిడి తేవాలని బీజేపీ ఎంపీని నిలదీద్దాం.. అని మంత్రి తెలిపారు.