అభాగ్యుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్నది. సమైక్య పాలనలో రూ.200గా ఉన్న వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు తదితర పింఛన్ మొత్తాన్ని రూ. 2016, రూ. 3016కు పెంచి అందిస్తున్నది. దీనికి తోడు లబ్ధిదారుల వయస్సు 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించి కొత్త వారినిఎంపిక చేసింది. ఇంతటి ప్రతిష్టాత్మక పథకంపై కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తుండగా, అయోమయం వద్దు.. అర్హులందరికీ అమలు చేస్తున్నామని, ఎందుకు రాలేదో కూడా వెబ్సైట్లో కారణంతో సహా వివరంగా నమోదు చేస్తున్నామని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తున్నది. ఇక ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ మాలాంటోళ్ల బతుకులకు భరోసానిస్తున్నాడని, బురద జల్లేటోళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని పలువురు లబ్ధిదారులు చెబుతున్నారు.
రెక్కాడితే గానీ డొక్కాడని పేదోళ్లం. ఒకప్పుడు దొరికిన పని చేసుకొని బతికినం. ఇప్పుడు ముసలోళ్లమైతిమి. పని చేసే సత్తువ లేకుంటైంది. పిల్లలు గింత బువ్వ పెడుతరు. కానీ వాళ్ల తిప్పలు వాళ్లయ్. ఇగ వాళ్లను ఏమని అడుగుడు. బీపీ, షుగర్ గోలీలు కావాలన్నా.. పాణం బాగలేకపో యినా వాళ్లకు చెప్పుకోలేక మదన పడేటోళ్లం. గిసొంటి సమయంలో ముఖ్య మంత్రి కేసీఆర్ ఆసరా పింఛన్ రూ.2016కు పెంచిండు. పిల్లలపై ఆధారపడకుండా భరోసానిచ్చిండు. ఆత్మగౌరవంతో బతికేలా మా బతుకులకు ‘ఆసరా’ అయ్యిండు.
– ఇది ఆసరా పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, ఇతరుల మాట
స్వరా్రష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక.. రూ.200 ఉన్న పింఛన్ను రూ.2000 చేసిండు. గతంలో 36 లక్షల మందికి పింఛన్ ఇస్తుంటే, పింఛన్ కనీస అర్హత వయసును 57 ఏండ్లకు తగ్గించి మరో 10 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇస్తున్నడు. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులతో పాటు పైలేరియా పేషంట్లు ఈ పథకం కింద లబ్ధిపొందుతుండగా, తలసేమియా వ్యాధిగ్రస్తుల బాధలను దృష్టిలో ఉంచుకొని, వారిని పింఛన్లో చేర్చి మానవతాదృక్ప ధాన్ని, గొప్ప మనసును చాటి చెప్పుకున్నారు. ఇది జీర్ణించుకోలేని కొందరు రాజకీయంగా పూట గడుపుకునేందుకు, స్వార్థ ప్రయోజనాలకు జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రెచ్చగొట్టి ఆఫీసుల మీదకు పంపుతున్నారు. దీంతో కాళ్లు అరిగేలా తిరిగినా.. ఫలితం మాత్రం ఉండడం లేదు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నామని, పింఛన్ ఎందుకు రాలేదో వెబ్సైట్లో కారణంతో సహా వివరంగా నమోదు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకొని అవగాహన పెంచుకోవాలని, ఊరికే తిరిగితే వచ్చేది ఏం ఉండదని స్పష్టం చేస్తున్నారు. నిబంధనల ప్రకరాం 57 ఏళ్లు నిండినా.. కింద పేర్కొన్న కారణాలతో వారికి పింఛన్ రావడం లేదంటున్నారు. ఆ కారణాలేంటంటే..
– మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కోటపల్లి, అక్టోబర్ 7
కారణం వెబ్సైట్లో నమోదు చేశాం
ప్రభుత్వం దగ్గర 360 సాప్ట్వేర్ ఉంది. ఆధార్కార్డుతో అది లింక్ అయి ఉంటుంది. ఎవరికి ఎంత భూమి ఉంది. ఎవరి పేరు హెల్త్కార్డు డేటా బేస్లో ఉంది. ఎవరికి కారు ఉంది. ఎవరికి ట్రాక్టర్ ఉందనేది ఆ సాప్ట్వేర్లో ఉంటుంది. ఆ సాప్ట్వే ర్లోని వివరాల ఆధారంగా నిబంధనల ప్రకారం పింఛన్ మంజూరు అవుతుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయ్యిందో కూడా వైబ్సైట్లో స్పష్టంగా ఉంటుంది. అర్హులైన వారికి కావాలనే పింఛన్ నిలిపివేసేది ఏమీ ఉండదు. అలా అను కునే వారు అవసరమైతే కోర్టుకు కూడా పోవచ్చు. పైన పేర్కొ న్న సమస్యల కారణంగా పింఛన్ కోల్పోయిన వారు వాటిని పరిష్కరించుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. దసరా నాటికి కొత్త పింఛన్ డబ్బులు వస్తాయి. ఆ తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకు నేందుకు సైట్ ఓపెన్ అవుతుంది. నిబంధ నల ప్రకారం అర్హులై న వారందరికీ పింఛన్లు వస్తాయి. ఈ విషయంలో అనవసర అపోహలు పెట్టుకోవద్దు.
– డీఆర్డీవో, శేషాద్రి
కేసీఆర్కు రుణపడి ఉంటా
కొత్తగా వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని నేను కూలీనాలీ చేసుకుంటూ జీవనం చేసుకుంటున్నా. గుంటేడు భూమి లేని నాకు ఈసారి కేసీఆర్ సార్ పింఛన్ మంజూరు చేయడం సంతోషంగా ఉంది. ఇది వరకు నాకు రూ.200 పింఛన్ ఇచ్చేటోళ్లు. అవ్వి కూడా రాకుంట చేసిన్రు. అప్పటి నుంచి నాకు పింఛన్ రాలేదు. కొత్తగా ఈ సంవత్సరం దరఖాస్తు చేసుకుంటే కేసీఆర్ సార్ పింఛన్ మంజూరు చేసిండు. భార్య, పిల్లలు, ఇల్లు లేని నాలాంటోళ్లకు కేసీఆర్ అందించే రూ.2016 ఆసరా అవుతాయి. పింఛన్లు రావు.. ఏమీ రావు అని ప్రచారం చేసేటోళ్లను నమ్మవద్దు.
– మారుపాక దుర్గయ్య, ఎసన్వాయి, కోటపల్లి మండలం
కేసీఆరే మాకు పెద్ద కొడుకు
కొడుకులు లేని మాకు కేసీఆర్ సారే పెద్ద కొడుకు. ఒక్కతే బిడ్డ. పెండ్లి చేసి అత్తారింటికి పంపించిన. నా భర్త ఇస్తారి, నేను ఇంట్లోనే ఉంటూ కాలం గడుపుతున్నం. వయసుమీద పడడంతో రెండేళ్ల నుంచి పనికి పోతలేము. సీఎం కేసీఆర్ సార్ ప్రతి నెలా ఇచ్చే పింఛన్ డబ్బులతోనే రంది లేకుండా బతుకుతున్నం. గతంలో ఉన్న సర్కారోళ్లు మాకు పింఛన్ కేవలం రూ.200 మాత్రమే ఇచ్చేది. ఈ పైసలు ఎటూ సరిపోయేవి కావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాలోంటోళ్ల జీవితాల్లోకి వెలుగువచ్చింది. మాలాంటి నిరుపేద వృద్ధులు, ఎలాంటి దిక్కులేనోళ్లకు కేసీఆర్ గవర్నమెంట్ పెద్ద దిక్కుగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ నాయకుడు మా గురించి ఆలోచించలే.. కానీ బురద జల్లేందుకు లేనిపోనివి చెప్పేటోళ్లుంటరు నమ్మవద్దు.
– కుమ్మరి సోమక్క, సర్వాయిపేట, వృద్ధాప్య పింఛన్దారు (కోటపల్లి)
కేసీఆర్ సార్ లేకుంటే పూటగూడ గడవకపోయేది
నిలువనీడ లేని నాకే కేసీఆర్ సారే పెద్దకొడుకైతాండు. ఎలాంటి ఆధారం లేకుండా జీవిస్తున్న నాకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే రూ.2016 నాకు జీవనాధారం అవుతుంది. నేను మూడు పూటలా బుక్కెడు బువ్వ తింటు న్నా అంటే అది కేసీఆర్ సార్ చలవే. కేసీఆర్ సారే లేకుంటే నాకు పూట కూడా గడిచేదికాదు. నాకు ఉన్న జాగలో ఒక చిన్న గుడిసెకట్టుకొని ఉంటు న్నా. నేను కైకిలి పోయి నాలుగు రూపాయలు తెస్తేనే బుక్కెడు బువ్వ దొరికేది. కానీ కేసీఆర్ సీఎం అయినంక మాలాంటోళ్లకు పెద్దన్నయిండు. ఒంటరి జీవనం గడుపుతున్న మాకు పింఛన్ ద్వారా నెలకు రూ.2016 ఇస్తుండు. వయసు మీద పడ్డ ప్రస్తుత తరుణంలో కైకిలి పోవడం చేతనైత లేదు. రెండేళ్ల నుంచి ఇంటిపట్టునే ఉంటూ కేసీఆర్ ఆసరా ద్వారా అందిస్తు న్న రూ.2016తో కాలం నెట్టుకొస్తున్నా. గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ పైసలే నాకు జీవనాదారం. నెలనెలా ఖర్చులు పోను రూ.500 వరకు పక్కన పెట్టుకుంటున్నా. కేసీఆర్ సార్ ఇచ్చే పింఛన్ డబ్బులు లేకుంటే నా బతుకు ఎమయిపోయేదో. ఎవ్వరెవ్వరో చెప్పే మాటలు నమ్మవద్దు..
– ఓంకారి వొల్లమ్మ, మల్లంపేట, ఒంటరి మహిళ, పింఛన్దారు, కోటపల్లి
నిలువనీడ లేని నాకే కేసీఆర్ సారే పెద్దకొడుకైతాండు. ఎలాంటి ఆధారం లేకుండా జీవిస్తున్న నాకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే రూ.2016 నాకు జీవనాధారం అవుతుంది. నేను మూడు పూటలా బుక్కెడు బువ్వ తింటు న్నా అంటే అది కేసీఆర్ సార్ చలవే. కేసీఆర్ సారే లేకుంటే నాకు పూట కూడా గడిచేదికాదు. నాకు ఉన్న జాగలో ఒక చిన్న గుడిసెకట్టుకొని ఉంటు న్నా. నేను కైకిలి పోయి నాలుగు రూపాయలు తెస్తేనే బుక్కెడు బువ్వ దొరికేది. కానీ కేసీఆర్ సీఎం అయినంక మాలాంటోళ్లకు పెద్దన్నయిండు. ఒంటరి జీవనం గడుపుతున్న మాకు పింఛన్ ద్వారా నెలకు రూ.2016 ఇస్తుండు. వయసు మీద పడ్డ ప్రస్తుత తరుణంలో కైకిలి పోవడం చేతనైత లేదు. రెండేళ్ల నుంచి ఇంటిపట్టునే ఉంటూ కేసీఆర్ ఆసరా ద్వారా అందిస్తు న్న రూ.2016తో కాలం నెట్టుకొస్తున్నా. గవర్నమెంట్ ఇచ్చే పింఛన్ పైసలే నాకు జీవనాదారం. నెలనెలా ఖర్చులు పోను రూ.500 వరకు పక్కన పెట్టుకుంటున్నా. కేసీఆర్ సార్ ఇచ్చే పింఛన్ డబ్బులు లేకుంటే నా బతుకు ఎమయిపోయేదో. ఎవ్వరెవ్వరో చెప్పే మాటలు నమ్మవద్దు..
– ఓంకారి వొల్లమ్మ, మల్లంపేట, ఒంటరి మహిళ, పింఛన్దారు, కోటపల్లి