ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 16 : డీఈవో కార్యాలయం లో ఉపాధ్యాయుల సందడి కనిపించింది. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను బుధవారం రాత్రి ప్రకటించారు. వీటిల్లో తప్పులు ఉండడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయానికి గురువారం తరలివచ్చారు. తప్పుల సవరణకు 10 కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. దివ్యాంగులు, మెడికల్ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకున్నవారి వెరిఫికేషన్ను రిమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్స్కూల్ జాయింట్ డైరెక్టర్, అబ్జర్వర్ రాజీవ్ మాట్లాడుతూ.. తప్పులు లేని సీనియారిటీ జాబితాను తయారు చేస్తామని చెప్పారు. అనంతరం ఉపాధ్యా య సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. నిర్మల్, ఆదిలాబాద్ డీఈవోలు రవీందర్ రెడ్డి, ప్రణీత, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
నిబంధనలకు అనుగుణంగానే ప్రక్రియ
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ఉపాధ్యాయ, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఉంటుంద ని ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నా యకులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలు, జోన్ల పునర్విభజన అనంతరం అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు 317 ప్రకారం అభిప్రాయాలు స్వీకరించామని, వాటికి అనుగుణంగానే సీనియారిటీ జాబితాలు సిద్ధం చేశామన్నారు. ఈ ప్రక్రియ సాఫీగా సాగేందుకు సహకరించాలని కోరారు. జిల్లా గిరిజన క్రీడాధికారి పార్థసార థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులున్నారు.