జాతిపిత మోహన్దాస్ కరంచంద్ మహాత్మాగాంధీ చూపిన బాటలోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నడుస్తున్నారని, అహింసా మార్గంలోనే రాష్ర్టాన్ని సాధించారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఉన్నారు.
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 2 : యువత మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం నిర్మల్లోని గాంధీ పార్కులో మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. శాంతి, అహింసా నినాదంతో గాంధీజీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పట్ణణ అధ్యక్షుడు మారుగొండ రాము, ప్రముఖ వ్యాపార వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, అల్లోల వినోదమ్మ, మంత్రి సతీమణి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, నరేందర్, పోశెట్టి, నాయకులు ముడుసు సత్యనారాయణ, లింగంపల్లి లక్ష్మీనారాయణ, పాల్దే మహేందర్ ఉన్నారు.
ఎదులాపురం/ఆదిలాబాద్ రూరల్,అక్టోబర్2: ఆదిలాబాద్లోని కలెక్టరేట్లో గాంధీజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తాపట్నాయక్తో పాటు అధికారులు మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్, గాంధీ పార్కుల్లో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కులను కలెక్టర్ ఆదివారం ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన మార్గంలో పయనించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ శైలజ పాల్గొన్నారు.
సంక్షేమ పథకాల్లో దేశానికే మార్గదర్శకం
నార్నూర్,అక్టోబర్2: సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతిలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరామ్, వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, మాజీ మంత్రి అమర్సింగ్ తిలావత్, సర్పంచ్ గజానంద్ నాయక్, సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్ ఉన్నారు.