ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 16 : అక్టోబర్లో నిర్వహించిన ఇంటర్మీయట్ పరీక్షా ఫలితాలను గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా 56 శాతంతో 5వ స్థానంలో నిలిచిందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సీ రవీంద్ర కుమార్ తెలిపారు. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో కలిపి 9,941మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 5,592 మంది ఉత్తీర్ణులై 56శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన వారు తమ మార్కుల మెమోలను ఈ నెల 17 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. రీ కౌంటింగ్ కోసం ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జిల్లా నుంచి జనరల్ విభాగంలో 4,567మంది బాలురు పరీక్షలు రాయగా.. 2,284మంది పాసయ్యారు. ఇందులో బాలికల్లో 4,334మంది హాజరుకాగా 2,753 మంది పాసై 57శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో నాల్గో స్థానం సాధించారు. ఒకేషనల్ విభాగంలో 493 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా.. 227మంది, 547 మంది బాలికలకు 328 మంది పాసై 53 శాతం ఉత్తీర్ణత సాధించారు.
నిర్మల్ జిల్లాలో 55 శాతం..
ఇంటర్మీడియట్ బోర్డు గురువారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో నిర్మల్ జిల్లాలో 55 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు నోడల్ అధికారి పరుశురాం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,614 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయగా.. 3,748 మంది పాసయ్యారని తెలిపారు. ఇందులో బాలురు 3,058 పరీక్షలు రాయగా.. 1,485 మంది, బాలికలు 3,556 పరీక్షలు రాయగా 2,263 మంది పాసైనట్లు చెప్పారు. వొకేషనల్ పరీక్షల్లో 1,310 మంది పరీక్షలు రాయగా.. 602 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. సారంగాపూర్ మండలంలోని జామ్ బాలికల గురుకుల విద్యాలయంలోని విద్యార్థినులు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో సత్తాచారు. ఈ విద్యాలయంలో 37 మంది పరీక్షలు రాయగా.. 37 మంది పాసయ్యారు. ఎంపీసీ విభాగంలో మునేసుల శృతి 444/470, బైపీసీ విభాగంలో బొడ్డు ప్రీతి 413/440 మార్కులు సాధించారు. సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 185 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 170 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఉట్నూర్ విద్యార్థినికి రాష్ట్రస్థాయి ర్యాంకు
మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థిని రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. గురువారం సాయంత్రం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మండలంలోని దంతన్పల్లి గ్రామానికి చెందిన సిలివేరి సౌజన్య ఎంపీసీలో 466/470 మార్కులు సాదించి రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు, పూలాజీబాబా కళాశాల యాజమాన్యం ఆమెను అ భినందించారు. స్వీట్ తినిపించారు. జిల్లాస్థాయి అధికారులు సైతం శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థి చౌహాన్ ప్రదీప్ బైపీసీ విభాగంలో 431/440 మార్కులు సాధించి జిల్లాస్థాయి ర్యాంకర్గా నిలిచాడు.