ఆదిలాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) :ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిని విస్మరించారు. ప్రత్యేక రా ష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో మిగతా జిల్లాలతో పోటీ పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అ మలు చేస్తూ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నది. పరిశ్రమల స్థాపనకు వివిధ రకాల రాయి తీలను ప్రభుత్వం కల్పిస్తుంది. గతంలో హైదరాబాద్, బెంగళూరు, పూణెలాంటి పట్టణాలకు పరిమితమై న ఐటీ పరిశ్రమలు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నాయి.
ఆరు నెలల క్రితం ఆదిలాబాద్లో బీడీఎన్టీ ల్యాబ్ ఐటీ కంపెనీ ప్రారంభమైంది. ఇం దులో 120 మంది జిల్లాకు చెందిన యువకుల ఉద్యోగాలు చేస్తున్నారు. పలు దేశాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో వీరు పనిచేస్తున్నారు. అనతికాలంలోనే ఆదిలాబాద్లో ఐటీ కంపెనీ పేరు సంపాదించింది. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బీడీఎన్టీ ఐటీ కంపెనీని సందర్శించి నిర్వాహకులు, ఉద్యోగులతో మాట్లాడారు. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
విదేశాలకు చెం దిన కంపెనీలతో కలిసి వారు పనిచేస్తున్నట్లు చెప్పడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వారి సమస్యలను తెలుసుకున్న మంత్రి వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. నిరంతరం విద్యుత్ సరఫరాతో పాటు, భవనం ఆధునికీకరణకు అవసరమైన రూ.1.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని కలెక్టర్కు సూచించారు. మంత్రి స్పందనపై నిర్వాహకులు, ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు.
ఐదెకరాల్లో ఐటీ పార్కు
జిల్లాకు చెందిన యువకులు హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లోని ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆదిలాబాద్లో ప్రస్తుతం ఉన్న బీడీఎన్టీ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులు జిల్లాకు చెందిన వారే. జిల్లాలోని యువతకు మంచి ఉద్యోగాలు కల్పించడానికి ఆదిలాబాద్లో ఐదు ఎకరాల్లో ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలో పార్కుకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఆదిలాబాద్కు చెందిన సంజయ్ దేశ్పాండే బీడీఎన్టీ కంపెనీ ప్రారంభించగా, జిల్లాకు చెందిన పలువురు విదేశాల్లో పలు కంపెనీలు నిర్వహిస్తున్నారు. కొత్తగా స్థాపించే పరిశ్రమలకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుంది. దీంతో కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ పార్కులో జిల్లాకు చెందిన వారు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసే అవకాశాలుండగా, వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
పర్యాటక రంగం అభివృద్ధి
తెలంగాణకు కాశ్మీర్లా ఉన్న ఆదిలాబాద్ జి ల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్, ఆ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కు సూచించారు. గుట్టలు, జలపాతాలు, నదులు, వా గులు ఉన్నాయన్నారు. విభిన్న సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన జిల్లాలో పర్యాటక ప్రాం తం అభివృద్ధి చెందితే హైదరాబాద్కు చెందిన వారు ఇక్కడికి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. జిల్లాకు ఐటీ పార్కును మంజూరు చేయ డం, పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే జోగు రామన్నకు పరామర్శ
జైనథ్, సెప్టెంబర్ 26: ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నను సోమవారం మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ నుంచి నేరుగా జైనథ్కు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అనంతరం దీపాయిగూడకు చేరుకొని ఎమ్మెల్యే రామన్న మాతృమూర్తి జోగు భోజమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావ్, విఠల్రెడ్డి, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తదితరులున్నారు.
ఐలమ్మ విగ్రహానికి నివాళి
ఎదులాపురం,సెప్టెంబర్26: తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి, మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఎదుట ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.