నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 26 : మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి వేడుకల సందర్భంగా నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న వీరనారి ఐలమ్మ విగ్రహానికి మంత్రి ఐకే రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణమని చెప్పారు.
సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నిర్మల్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఐలమ్మ కాంస్య విగ్రహ ఏర్పాటుకు ఇటీవలే భూమిపూజ చేశామని, పనులు త్వరగా పూర్తి చేసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ఐలమ్మ త్యాగాలను మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణశిలలతో అడెల్లి ఆలయ నిర్మాణం
సారంగాపూర్, సెప్టెంబర్ 26 : శ్రీ మహా అడెల్లి పోచమ్మ దేవాలయాన్ని కృష్ణ శిలలతో సర్వారంగా సుందరంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అక్టోబర్ 1, 2వ తేదీల్లో జరిగే గంగనీళ్ల జాతర పోస్ట ర్లు, ఆహ్వాన పత్రికలను మంత్రి కార్యాలయం లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అడె ల్లి ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.12 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.
ఈ నిధుల ద్వారా కృష్ణ శిలలతో ఆలయ నిర్మాణం, అతిథి గృహా లు, మండపం, ఇరువైపులా రోడ్లు తదితర పను లు చేపడుతున్నట్లు చెప్పారు. అడెల్లి ఆలయ ని ర్మాణ పనులకు అక్టోబర్ 3న శంకుస్థాపన ఉం టుందని తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల రద్దీ దృష్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. టీఆర్ఎస్ మం డల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మ న్ అయిటి చందు, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ మా ర్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, టీఆర్ఎస్ నిర్మల్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ ఐర నారాయణరెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ ఎలిపెద్ది మాణిక్రెడ్డి, మాజీ అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్రెడ్డి, ఆలూర్ సొసైటీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ శ్రీనివాస్ యాదవ్, నాయకు లు ప్రభాకర్రెడ్డి, పతాని భూమేశ్, రాజేశ్వర్రా వు, ధర్మాజీగారి రాజేందర్, ముద్రం దినేశ్, సాకుపెల్లి సురేందర్, శేఖర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటుతోనే బతుకమ్మకు గుర్తింపు
దిలావర్పూర్, సెప్టెంబర్ 26 : రాష్ట్ర ఏర్పాటుతోనే బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలకేంద్రమైన దిలావర్పూర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహా న్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మండల పరిషత్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరెల ను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల అందజేశారు.
అనంతరం ఏర్పాటు చేసి న సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటీ లేవని పేర్కొన్నారు. సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలువాలని కోరా రు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్షర అనిల్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, సహకార సంఘం చైర్మన్ రమణారెడ్డి, రజక సంఘం నాయకులు అర్గుల రమణ, భూమేశ్వర్, సర్పంచులు వీరేశ్కుమార్, గంగారెడ్డి, శ్రీనివాస్, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్ఖాన్, ఆర్ఐ సంతోష్, ఐకేపీ అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.