కాగజ్నగర్, సెప్టెంబర్ 25: దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కులమతాలకు అతీతంగా ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిణీ చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. రంజాన్, క్రిస్మస్ పండుగలకు సైతం మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు.
ఎంతో విశిష్టత గల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. కుమ్రం భీం జిల్లాలో 2 లక్షల చీరలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సర్సిల్క్ పరిశ్రమ మూతపడిందన్నారు. 2014లో పేపర్ మిల్లును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరిపించిందని తెలిపారు. తెరిపించినప్పటికీ కొందరు లేని పోని విమర్శలు చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ అన్ని వర్గాల పండుగలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు. పట్టణంలో బతుకమ్మ వేడుకలకు అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీశ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, డీ ఈ రమాదేవి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాకీర్ షరీఫ్, నాయకులు వసీం, శరత్, సుభాన్, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 25: ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ కోరిక అని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు కొనియాడారు. ఆదివారం మంచిర్యాలలోని పలు వార్డుల్లో బతుకమ్మ చీరలను మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు.
హిందువులకు అతి ముఖ్యమైన దసరా పండుగను సం తోషంగా నిర్వహించుకోవాలనే బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ముస్లింలకు రంజాన్ పండుగకు తోఫా, క్రైస్తవులకు క్మిస్మస్ సందర్భంగా కానుకలను ఇస్తున్నారని తెలిపారు. ఆడపిల్లల పెళ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబార క్, ప్రభుత్వ దవాఖానలో ప్ర సూతీ అయిన వారికి కేసీఆర్ కి ట్, కేజీ టూ పీజీ ఉచిత విద్య, రైతు సంక్షేమ పథకాలు అం దిస్తున్నారని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, తహసీల్దార్ రాజేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
-మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు