ఆదిలాబాద్ టౌన్, సెప్టెంబర్ 25 : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మతో పాటు అన్ని పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని ఆదిలాబాద్ రూరల్ ఎంపీపీ గండ్రత్ రమేశ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్, భీంసరి, పొచ్చర గ్రామాల్లో ఆదివారం మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు జగదీశ్ యాదవ్, పరమేశ్వర్, మెట్టు ప్రహ్లాద్, సోనేరావ్, సర్పంచ్ మయూరి చంద్ర, ఎంపీటీసీ గంగాధర్, నరేశ్, మోతీరాం పాల్గొన్నారు.
బేల, సెప్టెంబర్ 25 : మండలంలోని కోగ్దూర్, పాటన్, కొబ్బయి గ్రామాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జక్కుల మధుకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు మస్కే తేజ్రావ్, మంగేశ్ ఠాక్రే, సంతోష్ బెదుడ్కర్, సర్పంచ్ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, సెప్టెంబర్ 25 : తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చీరెలు పంపిణీ చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాలలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చౌహాన్ సునీత, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ సుభాష్పాటిల్, నాయకులు వెంకటేశ్, రాథోడ్ ప్రకాశ్, ప్రవీణ్, గంగారెడ్డి, రామేశ్వర్, రవి, గంగయ్య, గణేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, సెప్టెంబర్ 25 : ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం చీరెలు అందిస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. మండలంలోని సీతాగోంది గ్రామంలోని రైతువేదికలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అలాగే కమలాపూర్, గర్కంపేట మహిళలు చీరెలు అందుకొని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మడావి ధనలక్ష్మి, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో సునీత, ఐకేపీ ఏపీఎం భగవాండ్లు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ, సర్పంచ్లు ప్రేమలత, మల్కు, లక్ష్మణ్, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యుడు జమీర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ, సెప్టెంబర్ 25 : మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఎంపీపీ రాథోడ్ సజన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, వైస్ఎంపీపీ మహేందర్రెడ్డి, కుమారి పీఏసీఎస్ చైర్మన్ రమేశ్, సర్పంచ్లు పెంట వెంకటరమణ, విశాల్కుమార్, జాదవ్ సుభాష్, కుమ్రం జంగు, ఎంపీటీసీ పండరి, తహసీల్దార్ పవన్చంద్ర, ఎంపీడీవో అబ్దుల్సమద్, నాయకులు చంద్రశేఖర్యాదవ్, మండాడి కృష్ణ, కరణ్సింగ్, మహేందర్, ఆత్రం భీంరావ్, నారాయణస్వామి, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
ఉట్నూర్, సెప్టెంబర్ 25: మహిళలు బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావ్, వైస్ఎంపీపీ బాలాజీ, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాంనాయక్, నాయకులు దాసండ్ల ప్రభాకర్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 25: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 80 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో 150 మంది మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, తహసీల్దార్ సోము, ఎంపీడీవో పుష్పలత, డిప్యూటీ తహసీల్దార్ రమేశ్, ఆర్ఐ లక్ష్మణ్, సర్పంచ్లు గాంధారి, రాథోడ్ శారద, విజయ, రాంచందర్, జాదవ్ లఖన్సింగ్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, ఆశాబాయి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు హరిదాస్, నాయకులు సుంకట్రావ్, రాందాస్, వసంత్రావ్, నగేశ్, నవాబ్బేగ్, తదితరులు పాల్గొన్నారు.