ఎదులాపురం, సెప్టెంబర్ 23 : సంక్షేమ వస తి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వారి ఆరోగ్య విషయం లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. చాంద గ్రామ స మీపంలోని తెలంగాణ మైనార్టీ బాలుర గురుకు ల పాఠశాల, జూనియర్ కళాశాలను శుక్రవారం కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన పదార్థాలను కిచన్ గదిలోకి వెళ్లి పరిశీలించారు. విద్యార్థుల చదువు, భోజన విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం, శుద్ధమై న తాగునీరు అందించాలని వార్డెన్లను ఆదేశించారు. వసతి గృహాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారం కనబడకుండా స్థానిక పారిశుధ్య సిబ్బంది ద్వారా శుభ్రం చే యించుకోవాలని సూచించారు. అనంతరం స్టోర్ రూమ్లోని బియ్యం, పప్పులు, గుడ్లు, కూ రగాయలు తదితర సామగ్రిని పరిశీలించారు.
సరుకులను నేలపై కాకుండా బెంచీల మీద ఉంచాలని తెలిపారు. విద్యార్థులకు అందించే అన్నంలో పురుగులు రాకుండా బియ్యాన్ని శుభ్రం చేయాలన్నారు. వసతి గృహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, విద్యార్థుల ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించా రు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడినప్పుడు వైద్యాధికారుల వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాలని చెప్పారు. ఫుడ్ కమిటీ భోజనాలను రుచి చూడాలని, ఆ రోజున రుచి చూసిన వారి పేర్ల ను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. దసరా సెలవుల సందర్భంగా విద్యార్థులు వారి ఇండ్లకు వెళ్లి తిరిగి పాఠశాల ప్రారంభం రోజున తప్పకుండా హాజరయ్యేలా అధికారులు పోషకులకు తెలియజేయాలని ఆమె సూచించారు. ఆమె వెంట డీఎస్సీడీవో భగత్ సునీతాకుమారి, డీఎండబ్ల్యూవో కృష్ణవేణి, ప్రిన్సిపాళ్లు, వార్డెన్ సిబ్బంది ఉన్నారు.
సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, విద్యాబోధన, భోజనం, వసతులపై అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆరా తీశారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధ న తీరును తరగతి గదుల్లోకి వెళ్లి పరిశీలించారు. విద్యార్థులు చదువుతున్న తీరు, ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠ్యాంశాలను అడిగి తెలుసుకున్నా రు. అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు చికిత్సలు చేయించాలన్నారు. ఆయన వెంట ప్రి న్సిపాల్ శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది ఉన్నారు.