ఎదులాపురం, సెప్టెంబర్18 : ప్రజా సంక్షేమం.. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని కేఆర్కే కాలనీలో రూ. 10 లక్షలతో శ్మశాన వాటిక, పిట్టలవాడలో రూ. 35 లక్షలతో శ్మశాన వాటిక, రూ. 40 లక్షలతో పద్మావతి నగర్ నుంచి పిట్టలవాడ వారకు బీటి రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. హైదరాబాద్లోని నూతన సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.
అలాగే బంజారాహిల్స్లో కుమ్రం భీం ఆదివాసీ, సేవాలాల్ భవనాల ప్రారంభోత్సవం గర్వించ దగ్గ విషయం అన్నారు. సీఎం కేసీఆర్ కులమతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ , పట్టణ అధ్యక్షుడు అజయ్, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్లు అంజూబాయి, సంగీత, దమ్మపాల్, స్వరూప రాణి, మమత, మెట్టు ప్రహ్లాద్, ఆశన్న, దీవిటి రాజు పాల్గొన్నారు.
జైనథ్, సెప్టెంబర్18 : మండలంలోని ఆనంద్పూర్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిరిగిరి ఆశన్న , సిరిగిరి ఉమేశ్, తిరుపతి ఎమ్మెల్యే జోగురామన్న సమక్షంలో క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్, టీఆర్ఎస్ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, నాయకులు సాయినాథ్, సుభాష్ రెడ్డి, దశరథ్ రాంరెడ్డి, రాహుల్ రెడ్డి, నర్సింగ్ పాల్గొన్నారు.