ఆదిలాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పరిస్థితి అధ్వానంగా ఉం డేది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇక్కడి ప్రజల పాలిట వరంగా మారాయి. రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రెసిడెన్షియల్ స్కూళ్లు, మిషన్ భగరీథ, దళితబంధు లాంటి పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఇతర రాష్ర్టాలు మన పథకాలను ఆచరిస్తున్నాయి. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో పలు మార్పులు తీసుకువచ్చాయి. గతంలో ఉపాధి కోసం వలసలు పోయే పల్లెవాసులు ఇప్పటి ఉన్నచోట ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వ పథకాల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగపడమే కాకుండా రైతులు, కులవృత్తులు, వివిధ వర్గాల ప్రజలు మెరుగైన జీవితం గడుపుతున్నారు.
గిరిజనుల హర్షాతిరేకాలు
ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. గిరిజన విద్యార్థు ల కోసం ఆశ్రమ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ, బీఈడీ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ట్రైకార్ పథకంలో భాగం గా నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేస్తూ ఉపాధి క ల్పిస్తున్నది. అటవీ భూములు సాగు చేస్తున్న గిరిజనులకు ప ట్టాల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గిరిజన గ్రా మాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసి తండాలు, ఆదివాసీ గూడేల్లో వారే పరిపాలన చేసేలా ప్రభుత్వం అవకాశం క ల్పించింది. పేద గిరిజనుల అభివృద్ధి కోసం కొత్త పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళితబంధు పథకం మాదిరి గిరిజనుల కోసం ‘గిరిజన బంధు’ పథకాన్ని అ మలు చేయనున్నట్లు ఆదివాసీ, బంజారా భవన్ప్రారంభోత్స వం సందర్భంగా సీఎం ప్రకటించారు. గిరిజన బంధు పథ కం అమలుపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవున్నాయి.
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ హర్షణీయం
కుభీర్, సెప్టెంబర్ 17 : పది శాతం రిజర్వేషన్ ఆదివాసీ, గిరిజనుల చిరకాల వాంఛ. దీనిని అమలు చేస్తూ జీవో జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. కేసీఆర్ హయాంలో గిరిజన బిడ్డలు అన్ని రం గాల్లో దూసుకెళ్తున్నారు. పోడు భూ ములకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని ప్రకటించించిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సముచిత గౌరవం కల్పిస్తున్న గొప్ప దార్శనికుడు. మండల గిరిజన వాసులందరి తరఫున సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.
-అల్కాతాయి సంజయ్ చౌహాన్, జడ్పీటీసీ, కుభీర్
గిరిజన బాంధవుడు సీఎం కేసీఆర్
బోథ్, సెప్టెంబర్ 17 : గత పాలకులు ఆదివాసీ గిరిజనులను ఎన్నడూ పట్టించుకోలేదు. కనీసం కుమ్రం భీం వర్ధంతి, జోడెఘాట్ అభివృద్ధి వైపు కూడా కన్నెత్తి చూడలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ మా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. జోడెఘాట్ అభివృద్ధి కోసం రూ.20 కోట్లు కేటాయించారు. ఇప్పుడు గిరిజన బంధు పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు. భూమిలేని పేద గిరిజనులకు పథకాన్ని వర్తింప చేస్తుండడంతో మేం ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం కల్పిస్తున్నారు. మా కోసం ఇంత కష్టపడుతున్న కేసీఆర్ను ఆదివాసీ గిరిజనులం ఎప్పటికీ మర్చిపోలేం.
-మెస్రం భూమన్న, ఐటీడీఏ పాలకవర్గం డైరెక్టర్
సీఎం కేసీఆర్తోనే సంక్షేమం..
నిర్మల్టౌన్, సెప్టెంబర్ 17: గిరిజనుల సంక్షేమం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. హైదరాబాద్లో ఆదివాసీ, బం జారా భవనాలు ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇన్నేండ్లలో ఏ ఒక్క నాయకుడూ ఇలాంటి ఆలోచన చేయలేదు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూసమస్య పరిష్కరిస్తామని కూడా చెప్పారు. గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు, గిరిజనబంధు వంటి పథకాలు అమలు చేస్తామని ప్రకటించడం హర్షణీయం. గిరిజన సంక్షేమాన్ని పట్టించుకున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరే. సీఎం కేసీఆర్కు ఆదివాసీలు రుణపడి ఉంటారు. ప్రతి గిరిజన గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం ఆయనతోనే సాధ్యమవుతుంది.
-తుకారాంనాయక్
చారిత్రక నిర్ణయం..
గిరిజనుల ఉపాధి మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ గిరిజన బంధు పథకం అ మలు చేయడం చారిత్రాత్మకమైంది. గత ప్రభుత్వాలు గిరిజనులను ఏ మా త్రం పట్టించుకోలేదు. దీంతో జిల్లాలోని గిరిజనులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. అటవీ భూములు సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. రైతుబంధు, రైతుబీమా, ఐటీడీఏ పథకాలు గిరిజనులకు ప్ర యోజనం చేకూర్చుతున్నాయి. గిరిజన బంధు పథకం పేద గిరిజనుల్లో జీవితాలను బాగు చేస్తుంది. సర్కారు సాయంతో వారు ఆర్థికంగా బాగు పడేలా ఉపయోగపడనున్నది.
– కనక లక్కేరావు, ఐటీడీఏ చైర్మన్, ఉట్నూర్
పేదరికం నుంచి దూరమవుతారు..
దళితబంధు మాదిరి పేద గిరిజనుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన బంధు పథకాన్ని ప్రకటించడం హర్షదాయకం. గిరిజనులు ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను సీఎం కేసీఆర్ ప్రకటనతో సాకారమైంది. ఈ పథకం గిరిజన జీవితాల్లో వెలుగులు నింపనున్నది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల కారణంగా గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన బంధును ప్రకటించడం సంతోషంగా ఉంది. గిరిజన బాంధవుడు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– మర్సకోల తిరుపతి, గిరిజన నాయకుడు, ఉట్నూర్
గిరిజన బంధు అమలు అభినందనీయం..
సీఎం కేసీఆర్ గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ల కల్ప న బిల్లును కేంద్రంకు పంపించినా ఉలు కు లేకపోయిందని, దీంతో రాష్ట్రమే 10శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ జీవో జారీ చేస్తామని సీఎం సభలో తెలపడం గిరిజనుల పాలిట గొప్ప వరం. భూమిలేని నిరుపేద గిరిజనులకు ‘గిరిజన బంధు’ అమలుకు కట్టుబడి ఉన్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటనతో పేద గిరిజనుల ఆనందాలకు అవధుల్లేవు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, గిరిజన నాయకులు అందరి తరఫున సీఎం కేసీఆర్, గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే జీ.విఠల్రెడ్డికి మండల ఆదివాసీ, గిరిజనులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
-శంకర్ చౌహాన్, మాజీ జడ్పీటీసీ