మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 16: 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో అరవై ఏండ్లు స్వీయ అస్థిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని పెద్దపల్లి వెంకటేశ్ ఎంపీ నేతకాని అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం వరకు పదివేల మంది విద్యార్థులు, ఐదు వేల మంది ప్రజలతో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలో యావత్ భారతదేశంలోనే వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ పేరు తెచ్చుకున్నదని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, విద్యుత్, నీటిపారుదల, పరిశ్రమలు, వ్యవసాయం, అభివృద్ధి, ప్రజాసంక్షేమం, తదితర రంగాల్లో తెలంగాణకు ఏ రాష్ట్రమూ సాటిలేదన్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో రాచరికపు పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైందని తెలిపారు.
సువిశాల భారత దేశంలో తెలంగాణ ప్రాంతం అంతర్భాగమైన దినోత్సవాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నిర్వహిస్తున్నారని, ప్రజలందరినీ భాగస్వాములను చేస్తున్నారని తెలిపారు. ఎంతోమంది త్యాగధనుల కృషితో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, మరెంతోమంది పోరాటాలతో తెలంగాణ భారతదేశంలో కలిసిందన్నారు. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ రాచరికం, అణచివేత, వెట్టిచాకిరీ లాంటి దోపిడీ నుంచి విముక్తి కోసం ఎంతో మంది ఉద్యమకారులు పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, ప్రభాకర్, వైస్ చైర్మన్లు ముఖేశ్గౌడ్, తోట శ్రీనివాస్, ఏసీపీ తిరుపతిరెడ్డి, ఆర్డీవో వేణు, తహసీల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్లు బాలకృష్ణ, టీ రమేశ్ (నస్పూర్), కౌన్సిలర్లు సుధామల్ల హరికృష్ణ, గాదె సత్యం, అంకం నరేశ్, ప్రకాశ్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేశ్, మహిళా నాయకురాళ్లు అత్తిసరోజ, మామిడిశెట్టి వసుంధర, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్, సెప్టెంబర్ 16: దేశ, రాష్ర్టాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరాంకితం కావాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి పేర్కొన్నారు. చెన్నూర్లో శుక్రవారం తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాల ర్యాలీ బలాల్ పెట్రోల్ బంక్ నుంచి ప్రారంభమైన కొత్త బస్టాండ్ మీదుగా ప్రధాన రహదారి వెంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల వరకు కొనసాగింది. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భారతీ హోళికేరి మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ తెలంగాణ రాష్ట్రం నిజాం పాలనలో ఏడాది పాటు కొనసాగిందని తెలిపారు. ఎందరో ఉద్యమకారుల పోరాటం, జాతీయ నాయకుల కృషితో భారతదేశంలో తెలంగాణ విలీనమైందని తెలిపారు.
ఉద్యమ కారుల త్యాగాలు తెలియజేసేందుకే తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలోని ఇతర రాష్ర్టాల వారు వచ్చి చూసి ప్రశంసిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ట్రైనీ కలెక్టర్ గౌతమి, ఏసీపీ నరేందర్, చెన్నూర్ మున్సిపల్ చైర్పర్సన్ అర్చనాగిల్డా, చెన్నూర్, కోటపల్లి ఎంపీపీలు మంత్రి బాపు, మంత్రి సురేఖ, చెన్నూర్, భీమారం, జైపూర్, మందమర్రి జడ్పీటీసీలు మోతె తిరుపతి, భూక్యా తిరుమల, మేడి సునీత, వేల్పుల రవి, చెన్నూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలరు, సింగిల్ విండో చైర్మన్లు, రైతు బంధు సమితి మండల కన్వీనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పలు శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్ళు, టీఆర్ఎస్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాత మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో మహిళలకు, సాయి మమత పాఠశాలలో పురుషులకు వేరు వేరుగా భోజనాలను ఏర్పాటు చేశారు.
వేడుకల నిర్వహణ సంతోషకరం : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి, సెప్టెంబర్ 16 : తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం సంతోషకరమని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏసీపీ ఎడ్ల మహేశ్తో కలిసి ఆయన మాట్లాడారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సభకు హాజరయ్యారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన దేశ భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ర్యాలీని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.
తిలక్ స్టేడియం నుంచి పాత బస్టాండ్, కాంటా చౌరస్తా మీదుగా ఏఎంసీ మైదానం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్యామలాదేవి, డీఆర్డీవో శేషాద్రి, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, తహసీల్దార్ కుమారస్వామి, సీఐలు జగదీశ్, బాబురావు, రాజు, కౌన్సిలర్లు గెల్లి రాజలింగు, బొడ్డు నారాయణ, భుక్యా రామునాయక్, కొక్కెర చంద్రశేఖర్, నెల్లి శ్రీలత, తుంగపల్లి సుజాత, పోతరాజుల లీలావతి, టీబీజీకేఎస్ ఏరియా దవాఖాన పిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు గడ్డం భీమాగౌడ్, నెలకంటి శ్రీధర్, నెల్లి రమేశ్, కొమ్మెర లక్ష్మణ్, తుంగపల్లి గంగాధర్, పోతురాజుల మంగమూర్తి తదితరులు పాల్గొన్నారు.