నార్నూర్, ఆగస్టు 17 : ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎస్పీ డీ.ఉదయ్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని ఖైరదట్వా గ్రామంలో బుధవారం స్వస్థత రథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉట్నూర్ అదనపు ఎస్పీ హర్షవర్ధన్తో కలిసి కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో వైద్య శిబిరాల నిర్వహణకు పోలీస్శాఖ కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం గాదిగూడ, నార్నూర్ పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు.
కేసులు పెండింగ్ లేకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్స్టేషన్ మైదానంలో మొక్కలు నాటారు. నార్నూర్ సీఐ ప్రేమ్కుమార్, స్వస్థత రథ్ ఎండీ దాసరి శ్రీనివాస్, సీఈవో రంగాసాగర్ రావ్, అడిషనల్ డీఎంహెచ్వో కుడ్మెత మనోహర్, ఎంపీపీ కనక మోతుబాయి, సర్పంచ్ కనక సేవంతప్రభాకర్, ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగోరావ్, రాయిసెంటర్ జిల్లా సార్మెడి మెస్రం దుర్గుపటేల్, నారింజి పటేల్, వైద్యులు మనోజ్, విఠల్, సంతోష్ పాల్గొన్నారు. గాదిగూడ పోలీస్స్టేషన్ను సందర్శించిన ఎస్పీని మండల ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. వారిలో ఎంపీపీ ఆడ చంద్రకళా రాజేశ్వర్, వైస్ ఎంపీపీ యోగేశ్, సర్పంచ్ జైవంత్రావ్ తదితరులున్నారు.