ఎదులాపురం/నిర్మల్ టౌన్, ఆగస్టు 14 : స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లాలు ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలోని ఏఆర్హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానం.., నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, అదిలాబాద్లో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ సిక్తా పట్నాయక్, నిర్మల్లో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ రాంబాబు పరిశీలించారు. నిర్మల్లో ఉదయం 9 గంటలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి..,
ఆదిలాబాద్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జెండా వందనం చేయనున్నారు. మైదానాలతో పాటు స్టేజీ ఏర్పాటు పనులు పూర్తిచేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. వేడుకలకు జి ల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకాను న్న నేపథ్యంలో వివిధ గ్యాలరీలను ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. స్వా తంత్య్ర దినోత్సవ వేడుకల ను అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులందరికీ తగు ఆదేశాలు జారీ చేశామన్నారు.
వేడుకల్లో ముఖ్యఅతిథి రాక నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలతో కూడిన వివిధ శాఖల స్టాళ్లు, ఈ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు ప్రశంసాపత్రాల అందజేత, ప్రత్యేకంగా జాతీయ పతాకానికి జిల్లా పోలీసుల గౌరవ వందనం మొదలగు ప్రత్యేక అంశాలను ఏర్పాటు చేయాలని సూచించామని తెలిపారు. అలాగే ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీసు శాఖ పరంగా డీఎస్పీ ఎం విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసుల పరేడ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలను ప్రత్యేకంగా వేడుకలను వీక్షించేందుకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నటరాజ్, వివిధ శాఖల అధికారులు డీఎస్సీడీవో భగత్ సునీత, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీబీసీడీవో రాజలింగు, డీఆర్డీఏ కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, సిబ్బంది ఉన్నారు.