గర్మిళ్ళ ఆగస్టు 13 : మంచిర్యాల జిల్లాకేంద్రంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. జిల్లాలోని మంచిర్యా ల, చెన్నూర్, బెల్లంపల్లి, లక్షెట్టిపేట కోర్టుల్లో జరిగిన లోక్ అదాలత్లో ఇరువర్గాల రాజీతో 1127 కేసు లు పరిష్కరించారు. ఇందులో 12 బ్యాంక్ కేసులు పరిష్కరించి రూ.39.4 లక్షలు రికవరీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి సత్తయ్య మాట్లాడుతూ రాజీకి ఆమోదయోగ్యమైన కేసులు పరిష్కరించడానికి లోక్ అదాలత్ మంచి వేదిక అ ని అ న్నారు. జిల్లాలోని ఆయా కోర్టుల న్యాయమూర్తు లు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు, న్యా యవాదులు, న్యాయసేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
రాజీ మార్గమే రాచమార్గం
లక్షెట్టిపేట, ఆగస్టు13: పట్టణ న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం, హాజీపూర్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి పరిష్కరించారు. కార్యక్రమంలో సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ పాల్ సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, మాజీ అధ్యక్షుడు కేతిరెడ్డి భూంరెడ్డి, న్యాయవాదులు కొమిరెడ్డి సత్తన్న, శ్రీధర్, కూడెల్లి అశోక్, ప్రకాశం, తాజొద్దీన్, శివశంకర్తో పాటు జన్నారం జెమెదార్ రాజశేఖర్ కోర్టు పీసీలు శ్రీకాంత్, సత్యనారాయణ, శ్రీకాంత్, శంకర్రెడ్డి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
చెన్నూర్ మున్సిఫ్ కోర్టులో..
చెన్నూర్, ఆగస్టు 13 చెన్నూర్లోని మున్సిఫ్ కో ర్టులో లోక్ అదాలత్లో 150పైగా కేసులను పరిష్కరించినట్లు జూనియర్ సివిల్ జడ్జి సం పత్ తెలిపారు. బార్ కౌన్సిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంబాబు, న్యాయవాదులు మల్లేశంగౌడ్, రమేశ్ చందర్, పలువురు పోలీసులు పాల్గొన్నారు.
జాతీయ లోక్ అదాలత్ మంచి వేదిక
ఆసిఫాబాద్,అగస్టు13 : రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్అదాలత్ మంచి వేదిక అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవా సంస్థ చైర్మన్ రవీంద్ర శర్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మూడు బెంచీలు నిర్వహించి ఇరు వర్గాలు రాజీపడ్డ 421 కేసులను సీనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్, జూనియర్ సివిల్ జడ్జి ఉమామహేశ్వరి పరిష్కరించారు. అదేవిధంగా పలు కేసులకు సంబంధించి రూ. 22,77,200 సెటిల్మెంట్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఇరువర్గాలు ముందుకువచ్చి రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేష న్ అధ్యక్షుడు బోనగిరి సతీశ్బాబు, న్యాయవాదు లు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సిర్పూర్(టీ) జూనియర్ సివిల్ కోర్టులో
సిర్పూర్(టీ), ఆగస్టు 13 : మండలకేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి రవి మాట్లాడుతూ మొత్తం 331 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్కుమార్, న్యాయవాదులు దయారాజ్సింగ్, గణపతి, గంట కల్యాణ్, సతీశ్, శ్రీనివాస్, సిర్పూర్(టీ) ఎస్ఐ రవికుమార్, ఇతర మండలాల ఎస్ఐలు, కక్షిదారులు పాల్గొన్నారు.