నిర్మల్ అర్బన్/భైంసా/బోథ్/ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 11 : స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సిం గరేణి ప్రాంతంలోని కార్మిక వాడల్లో జాతీయ జెండాల పంపిణీ ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఆయా చోట్ల జీఎంలతో పాటు ఇతర అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మిక కుటుంబాల సభ్యులు పాల్గొని స్వా తంత్య్ర పోరాట స్ఫూర్తిని చాటుతున్నారు. దేశభక్తి, స మైక్యతాభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్ర మాలు ఉపయోగపడుతాయని అతిథులు పేర్కొన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం ఫ్రీడం రన్ ఉత్సాహంగా సాగింది. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. వందలాది మంది జాతీయ పతాకాలు చేతబూని పరుగు తీయగా, దారి పొడవునా ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో హోరెత్తింది. నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, భైంసాలో ఎమ్మెల్యే జీ విఠల్ రెడ్డి, ఆదిలాబాద్లో ఎమ్మెల్యే జోగురామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి, బోథ్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, విద్యార్థులు, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొని ఉత్సాహం నింపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగో రోజైన గురువారం స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగాయి. కాగా, జిల్లా కేంద్రాలతో పాటు అన్ని మండలాల్లో ఫ్రీడం రన్ నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో ఈ రన్ నిర్వహించగా, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువతీయువకులు, విద్యార్థులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి 2కే ఫ్రీడం రన్ను నిర్వహించగా, ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో యువత, క్రీడాకారులతో కలిసి క్రీడాజ్యోతి, జాతీయ జెండాలు చేతబూని పరుగు తీశారు. బేలలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, బోథ్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పోలీసులు, యువతీయువకులు, విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్యామ్గఢ్ కోట నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన ఫ్రీడం రన్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని రగిలించేలా ప్రభుత్వం వజ్రోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. ఎమెల్సీ దండె విఠల్, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే, ఏఎస్పీ కిరణ్ ఖారే తదితరులు పాల్గొన్నారు. నిర్మల్లో తిరుమల థియేటర్లో ప్రదర్శిస్తున్న గాంధీ చలన చిత్రాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్, అదనపు కలెక్టర్లు తిలకించారు. ముథోల్ నియోజకవర్గంలోని భైంసాలో 2.5కేరన్ను ఎమ్మెల్యే విఠల్రెడ్డి ప్రారంభించారు. కాగా, మాటేగాం టోల్ప్లాజా నుంచి వానల్పాడ్ గ్రామం వరకు జాతీయ రహదారిపై నిర్వహించిన ర్యాలీలో 250 అడుగుల జెండాతో విద్యార్థులు పాల్గొన్నారు. మిగతా మండలాల్లోనూ సీఐలు, ఎస్ఐల ఆధ్వర్యంలో ఫ్రీడం రన్ నిర్వహించారు.