మంచిర్యాల అర్బన్, ఆగస్టు 11;ఈజీఎస్లో పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే ఫీల్డ్ అసిస్టెంట్లు బుధ, గురువారాల్లో తిరిగి విధుల్లో చేరారు. సర్కారు ఆదేశాలతో ఎంపీడీవోలు వారికి బాధ్యతలు అప్పగించగా, ఆయా కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పలు చోట్ల పాలాభిషేకాలు చేశారు. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 812 మందికి ప్రయోజనం చేకూరింది. –
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహా మీ పథకం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే ఫీల్డ్ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం భ రోసా కల్పించింది. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ వారిని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో వేలాది కుటుంబా ల్లో ఆనందం నెలకొంది. రాజకీయ పార్టీల నాయకుల జోక్యం కారణంగా ఫీల్డ్ అసిస్టెం ట్లు రెండేండ్ల కిందట సమ్మె చేపట్టారు. సమ్మెను విరమించాలని చెప్పినా మొండిగా వ్యవహరించడంతో ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. దాంతో ఆందోళనకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్లు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరడంతో సీఎం అసెం బ్లీ వేదికగా వారికి హామీ ఇచ్చా రు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది.
నిర్మల్ టౌన్, ఆగస్టు 11 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,507 గ్రామ పంచాయతీలు ఉండగా 812 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 230 మంది, నిర్మల్లో 240 , మంచిర్యాలలో 173 , కుమ్రం భీం ఆసి ఫాబాద్ జిల్లాలో 169 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రయోజనం చేకూరనున్నది. ఉపాధి హామీ పనుల్లో భాగంగా చేపట్టే తెలంగాణకు హరితహా రం, కుంటల నిర్మాణం, పారిశుధ్యం, కందకాలు, చెక్డ్యాంల నిర్మాణం, పంట భూము ల్లో మట్టి తవ్వకం, ఇంకుడుగుంతలు, చేపల చెరువుల నిర్మాణంలో ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూలీలకు పని కల్పించి సంబంధిత రికార్డులను మండలస్థాయిలో ఆన్లైన్లో నమోదు చేసేవారు.
సీఎం కేసీఆర్ నిర్ణయంతో భరోసా..
ఫీల్డ్ అసిస్టెంట్లను బుధవారం నుంచే విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఉమ్మడి జిల్లాలో 850 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లో చేరనుండగా.. ఆయా కు టుంబాల్లో భరోసా ఏర్పడింది. కోరిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పనులు పెద్ద ఎత్తున జరిగాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు లేకపోవడంతో పర్యవేక్షణ గ్రామ కార్యదర్శులకు భారంగా మారింది. తిరిగి ఫీల్డ్ అసిస్టెంట్ల రాకతో గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లు డీఆర్డీఓతో పాటు స్థానిక ఎంపీడీఓ కార్యాలయాల్లో విధుల్లో చేరారు.
మంచిర్యాల జిల్లాలో 173 మంది విధుల్లోకి..
మంచిర్యాల అర్బన్, ఆగస్టు 11 : ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని 18 మండలాల్లో గల 173 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు మేలు జరగనున్నది. గురువారం జిల్లాలో 144 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు రిపోర్టు చేశారు. సమాచారం తెలియని వారు, వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేని వారు ఈ నెల 12 న రిపోర్టు చేసే అవకాశం ఉంది.