ఎదులాపురం, ఆగస్టు 10 : రాజకీయ లబ్ధి కోసం.. బీజేపీ నాయకులు లొల్లి చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండి పడ్డారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పుర స్కరించుకొని జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజర య్యారు. ముందుగా కుమ్రంభీమ్, రాంజీ గోం డు, కుమ్రం సూరు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ప్రదర్శించిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిం చా రు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. హెయి ర్షిప్ట్, ఎయిర్పోర్ట్ అంశాలు తెలంగాణ రాష్ట్ర పరిధిలో రావని కేంద్రం చేయాల్సిన పని అని పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కోసం బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వం ఎన్వోసీ ఇవ్వాలని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలం గాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీల మరణా లు అరి కట్టామని పేర్కొన్నారు. గత పాలకులు ఆదివాసీ గ్రామాలను పట్టించుకున్న పాపానా పోలేదన్నా రు. గిరిజన అడపులను కార్పొరేట్కు అప్పజెప్పే పనిలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతు న్నారన్నారు. వచ్చే ఏడాదిలోపు బీఎస్సీ అగ్రికల్చ ర్ కళాశాల ఏర్పాటు అవుతుందని పేర్కొ న్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు యూనిస్ అక్బానీ, లంక రాఘవులు, పార్థసారథి, బండి దత్తాత్రి, రవీందర్ రెడ్డి, పూసం సచిన్ ,అన్నామొల్ల కిరణ్ ఉన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి..
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 10 : ప్రతి ఒక్క రూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పిలుపు ఇచ్చారు. వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రం లో గాంధీపార్కులో ఫ్రీడం పార్కును ప్రారం భించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదే శాల ప్రకారం ఈ నెల 22 వరకు జిల్లా వ్యాప్తంగా వజ్రోత్సవాలు జరుగుతాయని పేర్కొ న్నారు. ప్రతి ఒక్కరూ వజ్రోత్సవాల సందర్భంగా తమ పరిధిలోని ఎక్కడో చోట మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కమిష నర్ శైలజ, డీఈ తిరుపతి, ఏఈ అరుణ్, కౌన్సిలర్లు జాదవ్ పవన్ నాయక్, అర్చన, భరత్, అశోక్స్వామి, సందా నర్సింగ్, పండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.