నిర్మల్ అర్బన్, ఆగస్టు 10 : జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిర్మల్లో జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానకు అనుబంధ వైద్యకళాశాల మంజూరు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్త ర్వులు వెలువరించిందని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిపాలన అనుమతులు జారీ చేస్తూ జీవోను విడుదల చేసిందని తెలిపారు. 100 ఎంబీబీఎస్ సీట్లుతో రూ.166 కోట్ల అంచ నా వ్యయంతో నిర్మల్లో వైద్య కళాశాల నిర్మాణం జరుగనుందని చెప్పారు. కళాశాల 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానుందని, కళాశాల భవన సముదాయం, వసతి గృహం, ప్రత్యేక వార్డులు, బ్లాకులను నిర్మించనున్నామన్నారు. పరిపాలన అనుమతులు రావడంతో త్వరలోనే పనులను ప్రారంభించనున్నామన్నారు.
నిర్మల్లో ఘనంగా సంబురాలు..
నిర్మల్ జిల్లాకు మెడికల్కళాశాల మంజూరు కావడంతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొ ని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చిత్రపటా నికి పాలాబిషేకం చేశారు. ఈ సందర్భంగా మం త్రి కృతజ్ఞతలు తెలిపి పటాకలు కాల్చి సంబు రాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడు తూ నిర్మల్ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా వైద్య కళా శాల కోసం ఎదురుచూస్తున్నారని వారి కోరికను సీఎం కేసీఆర్ నెరవేర్చారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు నిర్మల్ జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారం భించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ దర్మాజీ రాజేందర్, మారుగొండ రాము, అల్లోల మురళీధర్ రెడ్డి, పాకాల రాంచందర్, వెంకట్ రాంరెడ్డి, కౌన్సిలర్ గండ్రత్ రమణ, నాయకులు అడ్ప పోశెట్టి, కొండ శ్రీధర్ తదితరులున్నారు.
మహానీయుల త్యాగఫలం వల్లే స్వాతంత్యం
సారంగాపూర్, ఆగస్టు 9 : ఎందరో మహాను బావుల త్యాగాలు, పోరాటాల వల్ల భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని మంత్రి అల్లోల ఇంద్ర కరణ్రెడ్డి పేర్కొన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా సారంగాపూర్ మండలం గండిరామన్న హరిత వనం ఫ్రీడమ్ పార్కులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహానీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాలను ఎగుర వేసుకోవా లన్నారు. జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ, అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జిల్లా అటవీశాఖ అధికారి వికాస్మీనా, అల్లోల మురళీ ధర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, జిల్లా రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, డీసీసీడీ డైరెక్టర్ ఐరా నారాయణరెడ్డి, అడెల్లి ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, నాయకులు పాకాల రాంచందర్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, భూమేశ్, దండుసాయికృష్ణ, రాంరెడ్డి, మల్లయ్య, గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.