ఇచ్చోడ, ఆగస్టు 10 : భారతవని గర్వించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని జడ్పీ సీఈవో గణపతి పేర్కొన్నారు. వజ్రోత్సవ వనమహోత్సవంలో భాగంగా మండల కేంద్రంతో పాటు ముక్రా(కే) గ్రామంలో స్వతంత్ర ఉద్యానవనాన్ని (ఫ్రీడమ్ పార్కు)ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీసీఈవో మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువత ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో మొక్కలు నాటారు. గ్రామాల్లో 75వ స్వాతంత్య్ర ఆకృతి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, సర్పంచ్లు మీనాక్షి, చౌహాన్ సునీత, కుంట అరుంధతి, మారుతి, తహసీల్దార్ రాథోడ్ మోహన్సింగ్, ఎంపీడీవో రాంప్రసాద్, ఎఫ్డీవో బర్నోబా, డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ రామారావ్, ఎంపీవో కొమ్ము రమేశ్, ఏపీవో నరేందర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
నేరడిగొండ, ఆగస్టు 10 : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎంపీపీ రాథోడ్ సజన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం బోథ్ ఎక్స్రోడ్డు వద్ద గల అర్బన్పార్కులో మొక్కలు నాటారు. మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో సర్పంచ్ సోలంకి గీత ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. వడూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సర్పంచ్ సమత విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, సర్పంచ్ పెంట వెంకటరమణ, తహసీల్దార్ పవన్చంద్ర, ఎంపీడీవో అబ్దుల్సమద్, ఎఫ్ఆర్వో గణేశ్, ఎఫ్బీవో భీంజీనాయక్, ఏపీవో వసంత్రావ్, నాయకులు కరణ్సింగ్, రమేశ్, నారాయణ పాల్గొన్నారు.
మానవ జీవనానికి ప్రాణవాయువు చెట్లు
ఎదులాపురం, ఆగస్టు 10 : మావన జీవనానికి ప్రాణవాయువు చెట్లు అని స్పెషల్ బ్రాంచ్ సీఐ కృష్ణమూర్తి అన్నారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయ ఆవరణలో స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి 75 పండ్ల మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ అన్వర్ ఉల్ హక్, ఏఎస్ఐలు గణపతి, సురేందర్, కోటేశ్వర్రావు, స్వామి, నాగేశ్వర్రావు, సురేశ్ పాల్గొన్నారు.
బోథ్, ఆగస్టు 10 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా బోథ్, సొనాల, కౌఠ(బీ), ధన్నూర్(బీ), కరత్వాడ, పట్నాపూర్, ఘన్పూర్, దేవులనాయక్తండా గ్రామాల్లో 75 ఆకారంలో విద్యార్థులు మొక్కలు నాటారు. చుట్టూ మువ్వన్నెల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. పలు గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలు అందజేశారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ అతిఖొద్దీన్, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో జీవన్రెడ్డి, ఎస్ఐ రవీందర్, ఏపీవో జగ్దేరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, ఆగస్టు 10 : మండల కేంద్రంలోని తహసీల్, మండల పరిషత్ కార్యాలయాల్లో ఫ్రీడమ్ పార్కులను తహసీల్దార్ కూన గంగాధర్, ఎంపీడీవో రాథోడ్ రాధ జడ్పీటీసీ నర్సయ్య ప్రారంభించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 75 ఆకారంలో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో ఎంపీవో మహేందర్రెడ్డి, సూపరింటెండెంట్ రంగి పుష్ప, ఏపీవో శ్రీనివాస్, సర్పంచ్లు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జైనథ్, ఆగస్టు 10 : మండలంలోని గిమ్మ, కోర్ట గ్రామాల్లో ఫ్రీడమ్ పార్కులను ఎంపీపీ గోవర్ధన్ ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ విజయ్కుమార్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ చంద్రయ్య, అడిషనల్ డీఎంహెచ్వో సాధన, సర్పంచ్ ప్రేమల, ఎంపీటీసీ భోజన్న, ఎంపీడీవో గజానన్రావ్, ఎంపీవో వెంకటరాజు, నాయకులు పరమేశ్వర్, మహేశ్ పాల్గొన్నారు.
మహనీయుల త్యాగాలు గుర్తించేందుకే వజ్రోత్సవాలు
బేల, ఆగస్టు 10 : నేటి యువత స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు గుర్తించేందుకే వజ్రోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఫ్రీడమ్ పార్కును నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. పార్కులో 75 మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ వనిత ఠాక్రే, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఎస్ఐ కృష్ణ కుమార్, ఎంపీడీవో భగత్ రవీందర్, ఎంపీవో సమీర్ హైమద్, ఎఫ్ఆర్వో అరుణ, సర్పంచ్ ఇంద్రశేఖర్, నాయకులు గంభీర్ ఠాక్రే, సతీష్పవార్, దేవన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు రుక్సానా, పంచాయతీ కార్యదర్శి సురేశ్, అధికారులు పాల్గొన్నారు.
తాంసి, ఆగస్టు 10 : తాంసి, కప్పర్ల, బండలనాగాపూర్, జామిడి, వడ్డాడి, సవర్గాం, పాలోడి, గిరిగాం గ్రామాల్లో ఫ్రీడమ్ పార్కులను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. తాంసిలో ఏర్పాటు చేసిన పార్కును జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో భూమయ్య, ఎస్ఐ ధనశ్రీ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, ఎంపీవో సుధీర్రెడ్డి, ఎఫ్ఎస్వో ప్రేమ్సింగ్, మాజీ ఎంపీటీసీ గంగారాం పాల్గొన్నారు.
తలమడుగు, ఆగస్టు 10 : మండలంలోని 28 గ్రామ పంచాయతీల్లో పాలకవర్గ సభ్యులు, అధికారులు గ్రామస్తులకు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. రుయ్యాడి గ్రామంలో డెయిరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి పాల్గొన్నారు. కజ్జర్ల గ్రామంలో ఫ్రీడమ్ పార్కును జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, ఎంపీపీ కల్యాణం లక్ష్మి, సర్పంచ్ వెంకటమ్మతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. మండలంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో రమాకాంత్, ఎంపీవో దిలీప్ కుమార్, సర్పంచ్లు కరుణాకర్ రెడ్డి, పోతారెడ్డి, ఆనంద్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
జైనథ్, ఆగస్టు 10 : మండలంలోని లక్ష్మీపూర్, ఆడ, కూర, ఆనంద్పూర్, మాకోడ, మేడిగూడ, మాండగాడ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, గ్రామస్తులు మొక్కలు నాటారు.
భీంపూర్, ఆగస్టు 10 : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని నర్సరీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు 75 మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ రత్నప్రభ, వైస్ఎంపీపీ గడ్డం లస్మన్న ,తహసీల్దార్ మహేంద్రనాథ్, ఎంపీడీవో శ్రీనివాస్, ఈజీఎస్ ఏపీవో సంగీత, సర్పంచ్లు మడావి లింబాజీ, స్వాతిక, రమాబాయి, బక్కి లలిత, పెండెపు కృష్ణయాదవ్, నిమ్మ వేణుయాదవ్, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, నాయకులు నరేందర్యాదవ్, బక్కి కపిల్యాదవ్, జాదవ్ రవీందర్, రాథోడ్ ఉత్తమ్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఆగస్టు 10 : మండలంలోని హీరాపూర్ కేజీబీవీ ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులు 75వ ఆకారంలో మొక్కలు నాటి బెలూన్లను గాలిలోకి వదిలి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఎల్పీవో భిక్షపతిగౌడ్, ఎంపీపీ శోభాబాయి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీడీవో పుష్పలత, ఎస్ఐ సునీల్, వైస్ఎంపీపీ గోపాల్సింగ్, ఎంపీవో సంతోష్కుమార్, సర్పంచ్ గాంధారి, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, ఏపీవో జాదవ్ శ్రీనివాస్, టీఏలు మహేందర్, జాదవ్ విఠల్, టీఆర్ఎస్ నాయకులు సుంకట్రావ్, షేక్ సుఫియాన్, గ్రామాల సర్పంచ్లు, అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వనాలు పెంచేందుకు మొక్కలు నాటాలి
నార్నూర్, ఆగస్టు 10 : వనాలు పెంచేందుకు మొక్కలు నాటాలని గాదిగూడ జడ్పీటీసీ మెస్రం గంగుబాయి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా గాదిగూడ మండలం సావిరి గ్రామంలో మొక్కలు నాటారు. అలాగే నార్నూర్ మండలం తాడిహత్నూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో అధికారులు, ఉపాధ్యాయులు, మాన్కాపూర్ గ్రామంలోని పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో రాపెల్లి ఆశన్న, సర్పంచ్లు రాథోడ్ సావీందర్, మాజీ సర్పంచ్ కొడప జాకు, పంచాయతీ కార్యదర్శులు సునీల్, లవ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కేజీబీవీలో..
నార్నూర్, ఆగస్టు 10 : మండల కేంద్రంలోని కేజీబీవీలో ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మైదానంలో మొక్కలు నాటి జాతీయ జెండాలతో ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారిణి జాదవ్ కవిత, తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, ఆగస్టు 10: ఆదిలాబాద్ ఎంపీడీవో కార్యాలయం, మండలంలోని గ్రామాల్లోని నర్సరీల్లో 75 మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీజగదీశ్, ఎంపీడీవో శంక ర్, ఎంపీవో ఆన ంద్, సర్పంచ్లు పాల్గొన్నారు.