ఎదులాపురం, ఆగస్టు 5 : పోటీ పరీక్షలకు సన్నద్ధ్దమయ్యే అభ్యర్థులతో పాటు యువతకు ఉపయోగపడేలా గ్రామాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మావల మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా నిర్మించిన సవారి బంగ్లా షెడ్లను శుక్రవారం ప్రారంభించారు. అక్క డ పీరీల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో లైబ్రరీ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అంతకు ముందుకు ఎమ్మె ల్యే జోగు రామన్నకు డప్పుచప్పుళ్ల మధ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు స్థానికంగా లైబ్రరీ లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ విషయా న్ని గమనించి జడ్పీటీసీ నల్ల వనిత తన నిధులు నుంచి రూ.4లక్షలు భవన నిర్మాణానికి మంజూ రు చేశారని పేర్కొన్నారు.
అయితే భవనం పూర్తి కావడానికి ఆ నిధులు సరిపోవని తన దృష్టికి రావడంతో ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారు. మత సామరస్యానికి ప్రతీక అయిన మొహర్రం వేడుకలను ప్రతి ఒక్క రూ సంతోషంగా జరుపుకునేలా బంగ్లా వద్ద షెడ్ల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకు న్నట్లు పేర్కొ న్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని శాంతినగర్ నూతనంగా ఏర్పాటు చేసిన సవారీ బంగ్లా షెడ్ను స్థానిక వార్డు కౌన్సిలర్ అజయ్తో కలిసి ప్రారం భించారు. అనంతరం దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేసి చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చందాల ఈశ్వరీ, జడ్పీ టీసీ నల్ల వనిత , సర్పంచ్ ప్రమీల, మావల తహసీల్దార్ వనజ, వార్డు కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు నల్ల రాజేశ్వర్, రాజన్న, రాజేశ్వర్, మహేందర్, సృజన్ తదితరులు ఉన్నారు.