ఆదిలాబాద్ రూరల్, జూలై 25 : టీఆర్ఎస్ను మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ నగర్లో సుమారు 200మంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విజయవంతమయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, గ్రంథాలయ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎజాజ్, యువజన నాయకులు ప్రశాంత్, ఇబ్బు, అయూబ్ పాల్గొన్నారు.
సెలవుల్లోనూ గ్రంథాలయాన్ని తెరిచి ఉంచాలి..
పండుగల సీజన్లో సెలవు రోజుల్లోనూ నిరుద్యోగుల కోసం గ్రంథాలయాన్ని తెరిచి ఉంచాలని ఎమ్మెల్యే జోగు రామన్న అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నిరుద్యోగులు కలిసి పండుగల నేపథ్యంలో వరుస సెలవులు వస్తున్నాయని, గ్రంథాలయాన్ని మూసేస్తే తాము చదువుకోవడానికి ఇబ్బంది కలుగు తుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆయన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీఈ తిరుపతి పాల్గొన్నారు.