ఖానాపూర్ టౌన్, జూలై 20: భారీ వర్షాలతో దెబ్బతిన్న కల్వర్టు, సీసీ రోడ్లకు శాశ్వత పరిస్కారం చూపిస్తామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. బుధవారం ఖానాపూర్ మున్సిపాలిటలోని 11వ వార్డు రాజీవ్నగర్, జేకే నగర్ కాలనీల్లో ఎమ్మెల్యే రేఖానాయక్, అదనపు కలెక్టర్ హేమంత్ బొర్కడేతో కలిసి పర్యటించారు. వరదలతో దెబ్బతిన్న రోడ్లు, ఇండ్లను పరిశీలించారు. కాలనీ సమస్యల గురించి ప్రజలు, కౌన్సిలర్ రాజురా సత్యంను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో పలు సమస్యల గురించి ఎమ్మెల్యే రేఖానాయక్ కలెక్టర్కు వివరించారు. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు ఉన్నారు.
వారం రోజుల్లో రోడ్డు నిర్మాణ పనులు
కడెం, జూలై 20 : వారం రోజుల్లో తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయిస్తామని సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రటరీ(ఐఏఎస్) శ్రీనివాస రాజు పేర్కొన్నారు. కడెం ప్రాజెక్ట్ వరద ప్రవాహంతో దెబ్బతిన్న వంతెనను బుధవారం ఎమ్మెల్యే రేఖా నాయక్, ఆర్అండ్డీఈఎన్సీ రవీందర్రావు, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులను రోడ్డు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖానాపూర్-మంచిర్యాల మధ్య రాకపోకలకు ఉన్న ఏకైక మార్గం ఈ ప్రధాన రహదారి కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఇక్కడ అడిషనల్ కలెక్టర్ హేమంత్ బొర్కడే, ఆదిలాబాద్ ఎస్పీ రాజేందర్ నాయక్, అధికారులు ఉన్నారు.
ఆందోళన వద్దు.. వంతెన నిర్మిస్తాం
పెంబి, జూలై 20: ఇటీవల కురిసిన వర్షాలకు పస్పుల వంతెన కొట్టుకుపోవడంతో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ బుధవారం ఈఎన్సీ అధికారి సంజీవ్రావుతో కలిసి పరిశీలించారు. అనంతరం శెట్పల్లి, ఇటిక్యాల గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎవరూ ఆందోళన చెందవద్దని, తెగిపోయిన పస్పుల వంతెనతో పాటు ఇతర వంతెనలు, రోడ్లను పునరుద్ధరిస్తామని చెప్పారు. పస్పుల వంతెన తెగిపోవడంతో హరిచంద్తండా, తులసీపేట్, అంకెన, రాయదారి, పోచంపల్లి, కోరకంటి, కర్ణంలొద్దితో పాటు పలు గ్రామాల రాకపోకలు నిలిచిపోయాయని అధికారులకు సూచించారు. మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించాలన్నారు. పస్పుల వంతెనపై స్టీల్ గర్డర్ ఏర్పాటు చేసి రాకపోకలు పునరుద్ధరిస్తామని ఈఎన్సీ అధికారి సంజీవ్రావు తెలిపారు.
వరదలు అధికంగా రావడంతోనే పస్పుల వంతెన తెగిపోయిందని వెల్లడించారు. శెట్పల్లిలో కడెం వాగుపై వంతెన ఏర్పాటుకు డిజైన్ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఈఈ శంకరయ్య, డీఈ చందూనాయక్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సల్ల నరేందర్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ భూక్యా టీకాజీ, సర్పంచులు పూర్ణచందర్ గౌడ్, తానాజీ, నాయకులు గాండ్ల శంకర్, విలాస్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.