ఆదిలాబాద్ రూరల్, జూలై 20: పట్టణ పరిశుభ్రతకు అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపల్ కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్లోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వైద్యులు కార్మికులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ కార్మికులు చేస్తున్న సేవలను గుర్తించి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలకు రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని గమనించిన బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి నిధులు విడుదల చేయడం లేదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రత ముఖ్యం
భీంపూర్, జూలై 20 : వానకాలంలో పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులకు దూరంగా ఉండొచ్చని భీంపూర్ పీహెచ్సీ వైద్యాధికారి విజయసారథి సూచించారు. మండలంలోని ధనోరా, గోనా గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. వార్డుల్లో మురుగుకాలువలు, నీరు నిలువ ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. అలాగే కరణ్వాడి, టేకిడిరాంపూర్, కరంజి(టీ), డబ్బాకుచి, భగవాన్పూర, బేల్సరిరాంపూర్, జలకొరి, అంతర్గాం గ్రామాల్లో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఈవో జ్ఞానేశ్వర్, సిబ్బంది బింగి గంగాధర్, లూసి, సుజాత, విజయలక్ష్మి, జానాబాయి, లచ్చుబాయి, విష్ణుకుమార్, రాందాస్, శ్రీదేవి, అశోక్రెడ్డి, ఆశకార్యకర్తలు, సర్పంచ్లు బక్కి లలిత, రూప, స్వాతిక, పెండెపు కృష్ణయాదవ్, నాయకులు వైభవ్, కపిల్, జీ నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూలై 20 : మండలంలోని చించోలి గ్రామంలో స్థానిక ప్రభుత్వ దవాఖాన వైద్యాధికారి ఆకుదారి సాగర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో 65 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఓపెన్ బావుల్లో క్లోరినేషన్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పెందూరు శంకర్, హెల్త్ సూపర్ వైజర్ కళావతి, హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కైలాస్, జాదవ్ సుభాష్, పద్మ, ఆశ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
బోథ్, జూలై 20: మండలంలోని అందూర్ గ్రామంలో సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు నవీన్రెడ్డి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఈ యశోద, సూపర్వైజర్ స్వామి, ఏఎన్ఎం అర్చన, ఆశకార్యకర్తలు సునీత, లక్ష్మి, గులాబ్సింగ్, రామారావు, షకీల్ అహ్మద్ పాల్గొన్నారు.
వ్యాధులపై అప్రమత్తత అవసరం
ఇంద్రవెల్లి, జూలై 20 : ప్రజలు వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. మండలంలోని ముత్నూర్ గ్రామంలో ఇంద్రవెల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది జాదవ్ శ్రీనివాస్, బలరాం పాల్గొన్నారు.
ఉట్నూర్రూరల్, జూలై 20: మండలంలోని ధర్మాజిపేటలో దంతన్పల్లి పీహెచ్సీ డాక్టర్ అనురాధ ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది నూర్సింగ్, ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
తలమడుగు, జూలై 20: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి సూచించారు. మండలంలోని పల్సి(బీ)తండా గ్రామంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. మండల వైద్యాధికారి వంశీ పలువురికి వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపును ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్లు అంగుర్, మనోహర్, నాయకులు రాజేశ్వర్, వెంకటి, విలాస్, తదితరులు పాల్గొన్నారు.