సారంగాపూర్, నవంబర్ 5 : రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయరంగానికి 24 గంటల కరెంట్, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు తదితర సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పారు. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వమే కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. యాసంగిలో వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. అనంతరం మార్కెట్ యార్డులో ఆలూ ర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైటిం గ్ సిస్టమ్ను మంత్రి ప్రారంభించారు.
ఈ కా ర్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల ఇన్చార్జి అల్లో ల మురళీధర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణరెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల కన్వీనర్ కొత్తపెల్లి మాధవరావు, ఆలూర్ సొసైటీ అధ్యక్షుడు మాణిక్రెడ్డి, వైస్ ఎంపీపీ పతాని రాధ, సర్పం చ్ దండురాధ, ఆలూర్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ రాజ్మహ్మద్, అడెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రవీందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ మధుకర్రెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డం ముత్తన్న, నాయకులు జీవన్రావు, దండుసాయి కృష్ణ, పతాని భూమేశ్, మల్ల య్య, రమేశ్, డీసీవో శ్రీనివాస్రెడ్డి, డీఎస్వో తనూషా, డీఎం శ్రీలత, తహసీల్దార్ సంతోష్రెడ్డి, ఏవో రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.