నిర్మల్ అర్బన్, జూలై 6 : అన్ని మతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. చించోలి (బీ) శివారు వద్ద ముస్లిం మైనార్టీలకు కేటాయించిన ఈద్గాను మత పెద్దల తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం వి శ్వనాథ్పేటలోని ఈడెన్ గార్డెన్లో ఏర్పాటు చేసి న సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఈద్గామ్లో ప్రస్తుత ఈద్గా ప్రార్థనల కోసం సరిపోకపోవడంతో చించోలి (బీ) సమీపంలోని 10 ఎకరాల అటవీ భూమిని నూతన ఈద్గాకు కేటాయించామన్నారు.
మున్సిపల్ నిధులతో ఈ ద్గా, ప్రహరీ, రోడ్డు నిర్మించినున్న్ల తెలిపారు. వ చ్చే రంజాన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ము న్సిపల్ కమిషనర్ సంపత్కుమార్, ఎఫ్ఆర్వో జై పాల్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.