బైంసా, జూలై 6 : కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ల క్ష్యంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని సీ ఎం కేసీఆర్ ప్రారంభించారని రాష్ట్ర విద్య, సం క్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చై ర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి బుధవారం ఆయన పర్యటించా రు. పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పే ద, బడుగు, బలహీనవర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యం తో ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించారన్నారు.
మన ఊరు-మన బడిలో భాగంగా రా ష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో రూ.7,300 కోట్లతో అ న్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు తెలిపా రు. జిల్లాలో 260 పాఠశాలలకు రూ.80కోట్ల 86లక్షల 63వేలు కేటాయించామన్నారు. అం దులో ముథోల్ నియోజకవర్గంలో 112 పాఠశాలలను రూ.39.54కోట్లతో ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ఆయనను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఘ నంగా సత్కరించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పీ కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిఫ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, బామ్ని రాజన్న, తోట రాము, మంత్రి భోజరాం, పోతారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
పాఠశాలల పరిశీలన..
కుభీర్, జూలై 6 : మన ఊరు-మన బడిలో భాగంగా కుభీర్ మండలంలోని నిగ్వ, న్యూ సాం వ్లి, పార్డి(కే) ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి టీఎస్ఈడబ్ల్యూఐడీసీ రావుల శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. పనులు నాణ్యతగా ఉండేలా ఇంజినీరింగ్, మండ ల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఎమ్మెల్యేను ఎస్ఎంసీ కమిటీ సత్కరించింది.
అనంతరం పార్డి(కే) పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, నీరు పోశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విశ్వంబర్, ఎంఈవో బుడ్డోల్ల చంద్రకాంత్, ఎంపీవో సాయి ప్రసాద్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, ఆయా గ్రామాల సర్పంచులు, వైస్ ఎంపీపీ మోహియొద్దీన్, ఎంపీటీసీ పంతుల హన్మాండ్లు, పీఏసీఎస్ చైర్మన్ గంగాచరణ్, వైస్ మెంచు రమేశ్, ఏఎంసీ చైర్మన్ కందూరి సంతోష్, సంజయ్ చౌహాన్, అనిల్, డీ రాములు, సాతం రవికుమార్, ఎస్ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.
పంటల నమోదు ప్రక్రియకు శ్రీకారం..
నిగ్వ గ్రామంలో పంటల నమోదు కార్యక్రమాన్ని వ్యవసాయ క్షేత్రంలో ఏవో వికార్ అహ్మద్తో కలిసి ప్రారంభించారు. వానకాలం పంటల వివరాలను నమోదు చేసుకోవాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ, ఎమ్మెల్యే రైతులకు సూచించారు. పంట సాగు వివరాలు నమోదు చేసుకుంటే దిగుబడులు సులువుగా విక్రయించుకునే అవకాశం ఉంటుందన్నారు. పత్తి, సోయా క్షేత్రాల్లో పీఎస్బీ సేంద్రియ ఎరువును స్వయంగా వారు చల్లారు. కార్యక్రమంలో సర్పంచ్ గుంచెటి రాజు, ఎంపీటీసీ దేవిదాస్, ఏఈవో రాణి, నాయకులు తూం రాజేశ్వర్, సంజయ్, కందుర్ సంతోష్, గంగాచరణ్, రమేశ్, గంగాధర్, రైతులు పాల్గొన్నారు.
మైనార్టీ రెసిడెన్షియల్ పనుల పరిశీలన..
నిర్మల్ అర్బన్, జులై 6 : సారంగాపూర్ మండలం చించోలి (బీ) మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల అభివృద్ధి పనులను టీఎస్ఈడబ్ల్యూఐడీసీ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డిని స్థానిక నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అశోక్, గంగాధర్గౌడ్, తుకారాం, జగన్మోహన్రెడ్డి, జైపాల్రెడ్డి పాల్గొన్నారు.