ఆదిలాబాద్ టౌన్, జూలై 6 : అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలో బేడ (బుడగ) జంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మ గౌరవ సభకు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్తో కలిసి ఆయన హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేనివిధంగా కులవృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారన్నారు.
దళిత బస్తీ అమలులో రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని గుర్తుచేశారు. బేడ (బుడగ) జంగం సంఘం సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, సంఘం జాతీయ అధ్యక్షుడు ఎన్ఆర్ వెంకటేశం, ప్రతినిధులు నల్లబాబు, స హదేవ్, శరత్ చంద్ర, జిల్లా అధ్యక్షుడు పసుపుల రాజు, రాజేశ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
ైస్టెఫండ్, మెటీరియల్ అందజేత..
ఎదులాపురం, జూలై 6 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం ద్వారా అందించిన ైస్టెఫండ్, స్టడీ మెటీరియల్ను ఎమ్మెల్యే జోగు రామన్న అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ ద్వారా మినీ గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఆలస్యం చేసినప్పటికీ కేవలం స్థానిక అభ్యర్థులకే 95 శాతం ఉద్యోగాలు వచ్చేలా నిర్వహించే పక్రియలో కాస్త నోటిఫికేషన్లు అలస్యం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీబీసీడీవో రాజలింగు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, రైతు బంధు సమితి అధ్యక్షుడు లింగారెడ్డి, పార్థసారథి, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, దత్తు, ప్రమోద్ కుమార్ కత్రి తదితరులు పాల్గొన్నారు.