పెంబి, జూలై 6 : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీల సిబ్బందికి ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి సూచించారు. మండలంలోని వేణునగర్, కోశగుట్ట గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఆశ్రమ పాఠశాల, అంగన్వాడీ, దోత్తివాగును పరిశీలించారు. అంగన్వాడీలో గిరిపోషన్ విధానాన్ని పరిశీలించారు.
కోశగుట్ట ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగారు. బోర్డుపై మెనూ ఏర్పాటు చేసి, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలలో లైబ్రరీ సక్రమంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే స్టోర్ రూంలో శనగపప్పు పురుగు పట్టి ఉండడంతో వార్డెన్పై ఆగ్రహించారు. విద్యార్థుల హాజరు వందశాతం లేకపోవడంతో వారం రోజుల్లో పెంచాలని సూచించారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి, కూరగాయలు సాగుచేయాలన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దొత్తివాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు. వేణునగర్లో ఆదివాసీ భవన నిర్మాణాన్ని అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని స్థానికులు పీవోకు చెప్పగా, అందుకు ఆయన స్పందిస్తూ డీఎఫ్తో మాట్లాడి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. పీవో వెంట డీఆర్డీవో విజయలక్ష్మి, తహసీల్దార్ అడ్ప శ్రీధర్, ఎంపీడీవో లింబాద్రి, ఎంపీవో రత్నాకర్ రావు, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, ఏపీఎం గంగారెడ్డి, ఆర్ఐ షేక్ హుస్సేన్, నాయకులు భుక్యా గోవింద్, రమేశ్, విక్రమ్నాయక్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.