నిర్మల్ టౌన్, జూలై 6 : నిర్మల్ జిల్లాను విద్యారంగంలో మరింత ముందుంచాలని, అందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రాష్ట్ర అట వీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పదోతరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన జిల్లాలోని కుమ్మరి విద్యార్థులకు కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో తన నివాసంలో బుధవారం ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శాలువాలతో సత్కరించారు. మె మెంటోలు అందించారు. కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుద్ధవరపు గంగాధర్, నాయకులు రమేశ్, చంద్రం, అనిల్, పరమేశ్వర్ పాల్గొన్నారు.
అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రి..
సోన్, జూలై 6 : సోన్ మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి తల్లి గంగవ్వ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, బుధవారం ఉదయం ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మంత్రి వెంట టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్, జడ్పీటీసీ జీవన్రెడ్డి, మండల కన్వీనర్ మోహినొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, మహేందర్రెడ్డి, సర్పంచ్ వెంకాయిగారి హరిత శ్రీనివాస్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.