నిర్మల్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. తాజాగా రూ.16 కోట్లు మంజూరు చేసింది. ఇందులో మొదటి విడుతగా రూ.11 కోట్లు విడుదల చేయగా.. త్వరలోనే మరో రూ.5కోట్లు రానున్నాయి. ఈ నిధులను మౌలిక సదుపాయాలకు ఉపయోగించ నున్నారు. ఇప్పటికే మెస్ హాలును కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ప్రారంభించగా.. అదనంగా నాలుగు డంప్ యార్డులను నిర్మించ డానికి చర్యలు తీసుకుంటున్నారు. రూ.30 లక్షలతో పుస్తకాలను తెప్పించగా.. డిజిటల్ లైబ్రరీని అప్గ్రేడ్ చేస్తున్నారు. నాలుగు వేల మంది విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ను కూడా సిద్ధం చేశారు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అభివృద్ధే ధ్యేయంగా విద్యార్థుల సమస్యలపై దృష్టి సా రించింది. పది రోజుల నుంచి ముమ్మరంగా అభివృద్ధి పనులు చేపట్టింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రెండు రోజులకోసారి ట్రిపుల్ ఐటీని సందర్శిస్తున్నారు. ఇక్కడ చేపడుతున్న అభివృద్ధి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొదటి, రెండు విడుతల్లో మంజూరైన రూ.11 కోట్ల నిధులతో ఈ పనులను నాణ్యతలో రాజీ పడకుండా, వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో సమస్యల పరిష్కారానికి మరో రూ.5 కోట్లు అవసరమవుతాయని, ఇందుకోసం ఆయా శాఖల ద్వారా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ నిధులను సైతం మంజూరు చేసేందుకు ప్రభు త్వం ఆమోదం తెలుపడంతో పనులు వేగంగా సాగుతున్నాయి.
నిర్మల్ కలెక్టర్, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు ఎప్పటికప్పుడు విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తూ వారికి అవసరమైన సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో చేపడుతుండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నూ తన డైరెక్టర్గా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీశ్కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచే విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించింది. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు. ముందుగా హెల్త్ ప్రొఫైల్లో భాగంగా ప్రముఖ వైద్యులతో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. దీనికి ఇన్చార్జిగా భైంసా ఆర్డీవో లోకేశ్ నియమించారు. ఇలా ప్రతి విద్యార్థి హెల్త్ప్రొఫైల్ నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఆ మరుసటి రోజే కలెక్టర్ పర్యవేక్షించి విద్యార్థుల ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు. వారికి అవసరమైన చికిత్స అందేలా చూశారు. ఇప్పటి వరకు దాదాపు 4వేల మంది వి ద్యార్థుల హెల్త్ప్రొఫైల్ సిద్ధమైంది. మరో పది రో జుల్లో ట్రిపుల్ ఐటీలోని అందరి విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కానున్నది.
వసతుల కల్పనకు పెద్దపీట
విద్యార్థుల ప్రధాన డిమాండ్లు అయిన మెస్ నిర్వహణ, హాస్టల్లో వసతుల కల్పనకు అధికారులు ప్రాధాన్యమిచ్చారు. కేవలం 10 రోజుల్లోనే పను లు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఈ1, ఈ2 మెస్, ఈ3, ఈ4 మెస్లకు సం బంధించిన వంట గదుల్లో తాగు నీటి సరఫరా, శానిటేషన్, విద్యుత్, గ్యాస్ సరఫరా వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. స్పందించిన అధికారులు పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యం లో మరమ్మతు చేపట్టారు. ప్రస్తుతం వీటిలో కొన్ని పనులు పూర్తయ్యా యి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. హాస్టళ్లలో కూడా అవసరమైన మరమ్మతులు చేపట్టారు. డ్రై నేజీ వ్యవస్థను పూర్తి చేశారు. పీ1, పీ2 విద్యార్థులకు మెస్లు సరిపోక పోవడంతో 1500మంది విద్యార్థులు ఒకే సారి భోజనం చేసేలా నూతనంగా మరో మెస్ నిర్మించారు. దీనిని కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. హాస్టల్ గదుల్లో ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల మరమ్మతు చేపట్టారు.
పారిశుధ్య పనులు
దాదాపు 280 ఎకరాల్లో విస్తరించి ఉన్న ట్రిపుల్ ఐటీ ప్రాం గణంలో 10 జేసీబీ యంత్రాలను ఉపయోగించి పిచ్చి మొక్కలను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రస్తుతం ఉన్న డంప్ యా ర్డులతో పాటు మరో నాలుగు నిర్మించేలా చర్యలు చేపట్టారు. నిత్యం బాసర పంచాయతీ నుంచి చెత్త వాహనాన్ని ట్రిపుల్ ఐటీలోకి పంపి రోడ్లపై ఉన్న చెత్తను శుభ్రపరిచి బయటకు తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీని సైతం ప్రస్తుతం ఉ న్న సంఖ్య పరిమితి కంటే ఎక్కువ మంది చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు.
రూ.30 లక్ష లు వెచ్చించి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను ఇక్కడ అందుబాటులో ఉంచనున్నారు. రా బోయే 2022-23కు సంబంధించి ట్రిపుల్ ఐటీ లో అడ్మిషన్లకు నూతన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నూతనంగా నియమితులైన డైరెక్టర్ సతీశ్ కుమార్ ఎప్పటికప్పుడు తరగతులను పర్యవేక్షిస్తూ విద్యార్థుల సమస్యలు, టీచింగ్ సమస్యలు తెలుసుకుంటున్నారు. 24 గంటల పాటు విద్యార్థులకు అం దుబాటులో ఉంటున్నారు. ఇక విద్యార్థుల భద్రతకు సంబంధించి నిర్మల్ ఎస్పీ ప్రవీణ్కుమార్ ఆదేశాల మేరకు బాసర ఎస్ఐ మహేశ్ తన సిబ్బందితో కలిసి ని త్యం రాత్రి సమయంలో ట్రిపుల్ ఐటీలో పెట్రోలింగ్ చేస్తున్నారు.