ఎదులాపురం, జూలై 5: జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సర్కిల్కు పక్కా భవనం నిర్మించాలని మాల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో కొనసాగుతున్న ఎస్సీ స్టడీ సర్కిల్ కోసం స్థలం కేటాయించి, శాశ్వత భవన నిర్మాణం చేపట్టాలని విన్నవించారు. అద్దె భవనానికి ప్రభుత్వం ప్రతి నెల రూ.60వేలు చెల్లిస్తున్నదని గుర్తుచేశారు. దీంతో ప్రభుత్వానికి నష్టం వస్తున్నదని వివరించారు. ఈ విషయమై ఎమ్మెల్యే జోగు రామన్న సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం జిల్లాఅధ్యక్షప్రధాన కార్యదర్శులు అల్లూరి భూమన్న, దాసరి బాబన్న, నాయకులు సూరం భగవాండ్లు, సాయిబాబా, భాస్కర్, ప్రభాకర్, రాఘవేందర్, కాడెస్వామి, రాజేశ్వర్, విజయ్ తదితరులు ఉన్నారు.