ఎదులాపురం, జూలై 2 : పుట్టుకతో వచ్చే వ్యాధుల్లో కొన్నింటిని సర్జరీల ద్వారా నయం చేయవచ్చని, దవాఖానల్లో ఉచితంగా చేస్తామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రి మ్స్లో గల పాత ఓపీ భవనం పై అంతస్తులో శనివారం హైదరాబాద్కు చెందిన ఆకార్ ఆశ వైద్యు లు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్, డీఎంహెచ్వో మాట్లాడుతూ.. 18 ఏండ్లలోపు చిన్నారులకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు రాగా, అవసరమైన వారిని రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం కార్పొరేట్ దవాఖాన వైద్యులు మాట్లాడుతూ.. పుట్టుకతో వచ్చే వ్యాధుల్లో కొన్నింటిని సర్జరీల ద్వారా నయం చేయవచ్చన్నారు. 79 మంది పిల్లలకు పరీక్షలు చేయగా, 71 మందికి సర్జరీ అవసరం ఉందని గుర్తించామని తెలిపారు. ఇలాంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.