బోథ్, జూలై 2 : మండల కేంద్రంలోని పీఏసీఎస్లో శనివారం 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని నిర్వహించారు. పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల ఏర్పాటుతో రైతులకు రుణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. గ్రామ, మండల స్థాయిలో సంఘాల ఏర్పాటుతో వాటి పరిధిలోని బ్యాంకుల ద్వారా రుణాలు అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో సీఈవో గోలి స్వామి, ప్రవీణ్, అనిల్, రైతులు పాల్గొన్నారు.
కుమారి పీఏసీఎస్లో..
నేరడిగొండ, జూలై 2 : అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా కుమారి గ్రామంలోని పీఏసీఎస్లో చైర్మన్ మందుల రమేశ్ మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సహకార జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నీలకంఠేశ్వర్, బంధన్న, శంకర్, సీఈవో ప్రవీణ్, మాజీ డైరెక్టర్ గణపతిగౌడ్, గ్రామస్తులు రాజేశ్వర్, రాజారాం, రైతులు పాల్గొన్నారు.
సహకార సంస్థలు ఉత్తమ ప్రపంచాన్ని నిర్మించగలవు
తాంసి, జూలై 2 : సహకార సంస్థలు ఉత్తమ ప్రపంచాన్ని నిర్మించగలవని సహకార శాఖ ఆడిట్ అధికారి రాథోడ్ బిక్కు అన్నారు. 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్లోని విజయ డెయిరీలో సహకార జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవనోపాదులను సుస్థిరంగా సహకార రంగమే ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. విజయ డెయిరీ డీడీ మధుసూదన్ మాట్లాడుతూ సహకార వ్యవస్థతో విజయ డెయిరీ నడుస్తుందని అన్నారు. ఉమ్మడి జిల్లాలో సంఘాల ఏర్పాటు చురుగ్గా సాగుతున్నదని అన్నారు. కార్యక్రమంలో సహకార విద్యా అధికారి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ సభ్యులు ప్రకాశ్, నరేందర్, రైతులు, డెయిరీ సిబ్బంది పాల్గొన్నారు.
బజార్హత్నూర్లో..
బజార్హత్నూర్, జూలై 2: మండల కేంద్రంలోని పీఏసీఎస్లో సీఈవో నారాయణగౌడ్తో కలిసి చైర్మన్ మేకల వెంకన్న జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు చట్ల వినిల్, నారడి లింగన్న, దిగంబర్, సిబ్బంది, రైతులు,పాల్గొన్నారు.